తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై ఒక మహిళ పోలీసు కేసు పెట్టింది. తన భూమిని ఆక్రమించిన మంత్రి మల్లారెడ్డి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు అంటూ ఆ మహిళ దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. పద్మావతి అనే మహిళ పేరు మీద ఉన్న భూమిని లాక్కునేందుకు మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన వర్గీయులు మరియు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణ
పద్మావతి కుమార్తె శ్యామల దేవి తన తల్లి భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని.. వారి నుండి తమకు ప్రాణ హాని ఉందంటూ హైకోర్టును శ్యామల దేవి ఆశ్రయించింది. 2017లోనే ఈ భూమిని ఆక్రమించిన మంత్రి ఇప్పుడు రిజిస్ట్రేషన్ విషయంలో ఒత్తిడి చేస్తున్నారు. దాంతో మల్లారెడ్డిపై శ్యామల దేవి తన తల్లితో కలిసి హైకోర్టును ఆశ్రయించింది. మంత్రి ఈ విషయమై ఏం స్పందిస్తాడా అంటూ అంతా వెయిట్ చేస్తున్నారు.
231643 917550Hello. I wanted to ask one thingis this a wordpress internet internet site as we are planning to be shifting more than to WP. Furthermore did you make this template yourself? Thanks. 560670