Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ లో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది. కానీ అవి ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయాయి. అక్కడి ప్రేక్షకుల్లో రష్మిక మందన్నా కి గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అయినా కూడా రష్మిక మందన్నా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హిందీలో సక్సెస్ కోసం రష్మిక ఈసారి యానిమల్ సినిమా తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు వెళ్లబోతుంది.
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన యానిమల్ సినిమా లో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించింది. హీరోయిన్ గా రష్మిక మందన్నా కు బాలీవుడ్ లో ఇది మొదటి కమర్షియల్ భారీ విజయంగా నిలస్తుందని మేకర్స్ తో పాటు ఆమె అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.
సౌత్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ రష్మిక. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకి బాలీవుడ్ లో స్టార్ డమ్ దక్కించుకోవాలని, అక్కడి ప్రేక్షకులను అలరించాలనే ఆశ. అందుకే రష్మిక మందన్న యానిమల్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది. మరి ఈ అమ్మడి కోరిక తీరి యానిమల్ సక్సెస్ అయ్యి, బాలీవుడ్ లో మరిన్ని క్రేజీ సినిమా ల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంటుందా అనేది చూడాలి.