తెలంగాణ ఇంటర్ బోర్డు చేసిన నిర్వాకానికి పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై కోర్టు కూడా విచారణ అడిగింది. ఇక ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం పై తెలుగు హీరో రామ్ స్పందించారు. ఇంటర్ ను లెక్కలోకి తీసుకోవద్దని, ఇంటర్ పాస్ కాకుంటే జీవితమే లేదనుకోవడం పొరపాటని, తానసలు ఇంటర్ కూడా పూర్తి చేయలేదని అన్నాడు. విద్యార్థుల ఆత్మహత్యలు ఇంటర్ బోర్డు చేసిన హత్యలే అని ఫైర్ అయ్యాడు రామ్.
జీవితంలో మనం చేయబోయేదానికి, ఇంటర్ ను లెక్కలోకి తీసుకోవలసిన అవసరమే లేదన్నాడు. మనలోని టాలెంట్ ని బట్టి జీవితంలో ఎదుగుదల ఉంటుంది తప్ప. చదువుకు ఎదుగుదలకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. ఈ విషయం పై ప్రముఖ దర్శకుడు మారుతి కూడా ఘాటుగానే స్పందించాడు. పరిక్షలు మనలోని నైపుణ్యాన్ని, భవిష్యత్తును నిర్ణయించలేవని, తాను చదువులో చాలా యావరేజ్ స్టూడెంట్ అని, యానిమేషన్ లో మాత్రం టాప్ లో ఉండేవాడిని అన్నాడు. తాను దర్శకుడు అవ్వడానికి చదువుకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. ఇంటర్ ఫెయిల్ అయ్యామని చిన్న చిన్న కారణాలకు ప్రాణాలను తీసుకోవద్దని సూచించాడు. ఎవరో చేసిన పొరపాటుకు మన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవడం అంటూ ఘాటుగానే స్పందించాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా పరీక్షల పేరుతొ పిల్లలపై ఒత్తిడి తేవొద్దన్నాడు.
INTER RESULTS ey jeevitham anukuney na thammullaki, chellillaki..meeru jeevitham lo avvaboyedhaniki..cheyaboyedhaniki, idhi oka aa*** tho samanam…dayachesi lite thesukondi..
Itlu,
Inter kuda poorthicheyani me..
-R.A.P.O#InterBoardMurders— RAm POthineni (@ramsayz) April 23, 2019
తెలంగాణ ప్రభుత్వం చేతగాని తనమే ఈ నిర్వాకానికి కారణం. ఇంటర్ చదివే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని అంటున్నారు జనాలు. కేసీఆర్ పాలనను గాలికి వదిలేసి .. ప్రధాని కావాలన్నా కలల్లో బతుకుతున్నాడని, బంగారు తెలంగాణను తుంగలో తొక్కి కేసీఆర్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నడని జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించక పోవడం విశేషం.
