Switch to English

విశాఖ వైసీపీలో ‘భూముల గోల’: కొట్టుకు ఛస్తున్నారంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

అదేంటో, విశాఖపట్నం అనగానే భూముల కుంభకోణానికి కేరాఫ్ అడ్రస్ అయి కూర్చుంది.. అదీ ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక.! ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రాజధాని హైద్రాబాద్ తర్వాత అతి పెద్ద నగరం అంటే విశాఖపట్నం మాత్రమే. విశాఖపట్నం అందమైన నగరం. హైద్రాబాద్ తరహాలోనే విశాఖపట్నంలో కూడా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి స్థిరపడ్డ వారు చాలామందే వున్నారు. భిన్న సంస్కృతులు విశాఖలో కనిపిస్తాయి. పైగా, ఉత్తరాంధ్ర మార్కు అమాయకత్వం కూడా అక్కడ ఎక్కువే. అన్నిటికీ మించి, విశాఖలో విలువైన భూములున్నాయ్. అదీ అసలు సంగతి.

సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూములు కావొచ్చు, ఇతరత్రా విలువైన భూములు కావొచ్చు.. వాటిపై ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పెద్దగా రాజకీయ గద్దల దృష్టి పడలేదు. ఓ మోస్తరుగా పడినా, విశాఖ ప్రజానీకం ఆ రాజకీయ గద్దల వ్యూహాల్ని తేలిగ్గానే తిప్పికొట్టగలిగారు. ఉత్తరాంధ్ర అంటే అమాయకత్వం మాత్రమే కాదు, పోరాటాల పురిటిగడ్డ కూడా.! కానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక పరిస్థితి మారిపోయింది. రాజకీయ వలస గద్దల తాకిడి ఎక్కువైపోయింది.

ఉత్తరాంధ్రలో పోరాటపటిమ కూడా తగ్గిపోయింది. ఇంకేముంది, రాజకీయ గద్దలు ఆడిందే ఆట.. పాడిందే పాట. మరీ ముఖ్యంగా గడచిన మూడేళ్ళలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సింహాచలం దేవస్థానానికి సంబంధించి రాజకీయ రగడ.. మన్సాస్ వ్యవహారానికి సంబంధించి రాజకీయ రగడ.. ఇవన్నీ చూస్తూనే వున్నాం. తాజాగా దసపల్లా భూముల వివాదం తెరపైకొచ్చింది. ‘నా కూతురి కుటుంబం భూముల్ని కొంటే, నాకేంటి సంబంధం.?’ అంటూ ఉత్తరాంధ్ర వాసి కాకపోయినా, విశాఖపై పెత్తనం చేస్తోన్న ఓ వైపీపీ ముఖ్య నేత చావు కబురు చల్లగా చెప్పాడు.

రియల్ ఎస్టేట్ రంగంలో రాణించి, రాజకీయాల్లోకి వచ్చిన ఓ వైసీపీ నేత కన్ను కూడా ఆ భూముల మీద పడింది. ఎక్కడో పంపకాల్లో తేడా వచ్చి, కుంభకోణానికి సంబంధించి అధికార పార్టీ నేతలే మీడియాకి లీకులిచ్చుకున్నారు. విషయం ముదిరి పాకాన పడింది. నిజానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరు, భూ కుంభకోణం.. ఇవన్నీ పార్టీకి నష్టం చేస్తాయని భావించి, రంగంలోకి దిగి.. ఇరువురికీ చీవాట్లు పెట్టాలి. కానీ, అలా జరగడంలేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...