గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వ్యాపారి పెరుమాళ్ల హనుమాన్ ప్రసాద్కు నరసరావు పేట రోడ్డులోని సర్వేనెంబర్ 174లో 11 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆ విషయమై కరాలపాడుకు చెందిన ఎం. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి హనుమాన్ ప్రసాద్ కు ఫోన్ చేసి బెదిరించాడట. ప్రెస్ మీట్ పెడుతావా ఆ భూమి నీకు ఎలా దక్కుతుందో చూస్తాం. రోడ్డు మీదకు వస్తే నరుకుతాం అంటూ బెదిరించారని, ఎమ్మెల్యే అంబటి రాంబాబుమనుషులం అంటూ వారికి వారు చెప్పుకున్నారు అంటూ హనుమాన్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి మీడియా ముందు మాట్లాడాడు.
ఈ భూమి విషయంలో అంబటి రాంబాబుకు ఎలాంటి సంబంధం లేదు. కాని వారు నన్ను బెదిరించేందుకు ఆయన పేరును వాడుకుంటున్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ను పోలీసులకు ఇవ్వడంతో పాటు మీడియాకు కూడా హనుమాన్ ప్రసాద్ వినిపించారు. తనకు న్యాయం కల్పించాలని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తామంటూ హామీ ఇచ్చారు.
945633 344717Great assist from this blog! Thanks alot for the data I required 159895
533660 502010I like this internet site very a lot so much outstanding info. 733512