జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఢిల్లీకి వెళుతున్నారు. ఇంతకీ, ఢిల్లీకి వెళ్ళి పవన్ ఏం చేస్తారు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళొచ్చారు. బీజేపీ పెద్దల్ని కలవడానికి పవన్ కళ్యాణ్ చాలా పాట్లు పడాల్సి వచ్చిందంటూ ప్రచారం జరిగింది.
అయితే, జనసేన వర్గాల వెర్షన్ ఇంకోలా వుంది. పవన్ కళ్యాణ్, పబ్లిసిటీ కోసం ఢిల్లీకి వెళ్ళలేదు. అక్కడ ఎలాంటి భేటీలు జరగాలో.. అలాంటి భేటీలు జరిగాయన్నది జనసేన పార్టీ వర్గాలు చెబుతున్న మాట. సరే, ఆ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ఢిల్లీకి వెళతానంటోన్న పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వ పెద్దలెవర్నయినా కలుస్తారా.? కలిసి వారితో కలిసి ఓ ప్రెస్మీట్ ఏమైనా నిర్వహించగలుగుతారా.? ఈ ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో పవన్ కళ్యాణ్కి సన్నిహిత సంబంధాలున్న మాట వాస్తవం. కానీ, అది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడూ అదే సాన్నిహిత్యం వారితో వుందని పవన్ కళ్యాణ్ నిరూపించుకోవాల్సిందేనేమో.! ఒకవేళ పవన్, ప్రధానిని కలిసినా, జనసేన పట్ల ‘చిల్లర’ ప్రచారం జరగడం సర్వసాధారణమే. ఈ విషయాన్నే జనసేన నేతలు ప్రస్తావిస్తున్నారు.
‘అమరావతి ఎక్కడికీ కదలదు.. ఇక్కడే వుంటుంది.. రాష్ట్రానికి ఒకే రాజధాని వుంటుంది..’ అని జనసేనాని కుండ బద్దలుగొట్టిమరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటనకు అనూహ్యమైన ప్రాధాన్యమేర్పడింది. ‘నాకు మాటిచ్చారు..’ అని ఇప్పటికే పవన్ అమరావతి విషయమై బీజేపీ పెద్దల గురించి ప్రకటన చేసిన దరిమిలా.. పవన్ ఢిల్లీ టూర్, ఎలాంటి సరికొత్త రాజకీయ సమీకరణాలకు వేదికవనుందో వేచి చూడాల్సిందే.
513862 42225Last month, when i visited your blog i got an error on the mysql server of yours. ~, 988282
723408 680633I adore reading and I conceive this internet site got some genuinely utilitarian stuff on it! . 305563
830562 206792great post. Neer knew this, thanks for letting me know. 546996