Switch to English

పార్లమెంటుకి ‘శీతాకాలం వణుకు’: కరోనా ఎఫెక్టేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘మంగళం’ పాడేసింది. కరోనా కారణంగానే శీతాకాల సమావేశాలు నిర్వహించడంలేదంటూ పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషి ప్రకటించారు. అరరె, కరోనా కారణంగా ఎంత కష్టమొచ్చింది.? అన్నట్టు, ఇది నిజంగానే కరోనా భయమా.? లేదంటే, ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల కారణంగా ఏర్పడ్డ భయమా.?

కేంద్రం మాత్రం, ‘ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించడం కష్ట సాధ్యమనీ, పార్లమెంటు సభ్యుల ఆరోగ్య రీత్యా అస్సలేమాత్రం క్షేమకరం కాదని భావించి కరోనా నేపథ్యంలో సమావేశాలు నిర్వహించకూడదనే నిర్ణయం తీసుకున్నామనీ, ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీల నుంచీ అభిప్రాయాల్ని తీసుకున్నామనీ కేంద్రం స్పష్టం చేసింది.

అవునా.? అలాగైతే, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి.? బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగాయి.? గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలు ఎలా జరిగాయి.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. కరోనా కారణంగా పలువురు ప్రజా ప్రతినిథులు ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ (తిరుపతి – వైపీపీ) కరోనా కారణంగానే చనిపోయారు.

పార్లమెంటు సమావేశాలంటే.. అంతమంది నేతలు ఒకే చోట గుమికూడటం.. అదీ సెంట్రల్‌ ఏసీ ప్రాంగణంలో వుండడం క్షేమకరం కాదు. కానీ, గతంలో కూడా కరోనా ఉధృతంగా వున్న సమయంలోనే పార్లమెంటు సమావేశాలు జరిగాయి. అప్పుడు కూడా కరోనా భయం వుంది. అప్పుడెందుకు సమావేశాలు జరిగాయి.? ఇప్పుడెందుకు జరగడంలేదు.? అన్న ప్రశ్న తలెత్తడం సహజమే.

ఢిల్లీ కేంద్రంగా కనీ వినీ ఎరుగని స్థాయిలో రైతులు ఉద్యమిస్తున్నారు. కేంద్రం కొత్తగా చేసిన వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన బాటపట్టిన విషయం విదితమే. ఈ సమయంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తే, అధికార పార్టీకి అది చాలా పెద్ద తలనొప్పి అవుతుంది. పైగా, వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాల్సింది కూడా పార్లమెంటే. పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేస్తే, రైతుల ఒత్తిళ్ళకు తలొగ్గాల్సి వస్తుంది.. విపక్షాలకు అడ్వాంటేజ్‌ అవుతుంది. అందుకే, అత్యంత వ్యూహాత్మకంగా మోడీ సర్కార్‌, నెపాన్ని కరోనా మీదకు నెట్టేసిందన్నమాట.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...