పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘మంగళం’ పాడేసింది. కరోనా కారణంగానే శీతాకాల సమావేశాలు నిర్వహించడంలేదంటూ పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషి ప్రకటించారు. అరరె, కరోనా కారణంగా ఎంత కష్టమొచ్చింది.? అన్నట్టు, ఇది నిజంగానే కరోనా భయమా.? లేదంటే, ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల కారణంగా ఏర్పడ్డ భయమా.?
కేంద్రం మాత్రం, ‘ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించడం కష్ట సాధ్యమనీ, పార్లమెంటు సభ్యుల ఆరోగ్య రీత్యా అస్సలేమాత్రం క్షేమకరం కాదని భావించి కరోనా నేపథ్యంలో సమావేశాలు నిర్వహించకూడదనే నిర్ణయం తీసుకున్నామనీ, ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీల నుంచీ అభిప్రాయాల్ని తీసుకున్నామనీ కేంద్రం స్పష్టం చేసింది.
అవునా.? అలాగైతే, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి.? బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగాయి.? గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు ఎలా జరిగాయి.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. కరోనా కారణంగా పలువురు ప్రజా ప్రతినిథులు ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ (తిరుపతి – వైపీపీ) కరోనా కారణంగానే చనిపోయారు.
పార్లమెంటు సమావేశాలంటే.. అంతమంది నేతలు ఒకే చోట గుమికూడటం.. అదీ సెంట్రల్ ఏసీ ప్రాంగణంలో వుండడం క్షేమకరం కాదు. కానీ, గతంలో కూడా కరోనా ఉధృతంగా వున్న సమయంలోనే పార్లమెంటు సమావేశాలు జరిగాయి. అప్పుడు కూడా కరోనా భయం వుంది. అప్పుడెందుకు సమావేశాలు జరిగాయి.? ఇప్పుడెందుకు జరగడంలేదు.? అన్న ప్రశ్న తలెత్తడం సహజమే.
ఢిల్లీ కేంద్రంగా కనీ వినీ ఎరుగని స్థాయిలో రైతులు ఉద్యమిస్తున్నారు. కేంద్రం కొత్తగా చేసిన వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన బాటపట్టిన విషయం విదితమే. ఈ సమయంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తే, అధికార పార్టీకి అది చాలా పెద్ద తలనొప్పి అవుతుంది. పైగా, వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాల్సింది కూడా పార్లమెంటే. పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేస్తే, రైతుల ఒత్తిళ్ళకు తలొగ్గాల్సి వస్తుంది.. విపక్షాలకు అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే, అత్యంత వ్యూహాత్మకంగా మోడీ సర్కార్, నెపాన్ని కరోనా మీదకు నెట్టేసిందన్నమాట.
341771 37260really nice post, i undoubtedly really like this internet site, maintain on it 508624