నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్యాంగ పదవిని అడ్డం పెట్టుకుని సొంత ఎజెండా అమలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. నిమ్మగడ్డ చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ రమేశ్ ఇప్పటికైనా రాజీనామా చేయాలని మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. గుడివాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు చంద్రబాబు కుట్రల్లో ఒక భాగమని మంత్రి అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవడమే చంద్రబాబు ఎజెండా అన్ని ఆరోపించారు.
రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను కాకుండా చంద్రబాబు డైరెక్షన్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు తెర తీశారని ఆరోపించారు. ఇది వారి కుట్రలో భాగమన్నారు. కుల, మతాలకు మధ్య గొడవలు సృష్టించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని నాని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని.. ఆయనకు నిమ్మగడ్డ వంతపాడుతున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డకు అధికారులు, పోలీసులు వ్యవస్థలన్నా లెక్కలేదని ఆరోపించారు. వీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని మంత్రి అన్నారు.
322937 517840I feel you did an awesome job explaining it. Positive beats having to research it on my own. Thanks 676065
198167 617310The overall look of your website is great, let well as the content! 425983