‘నామినేషన్లలో లేవు.. పైగా, స్ట్రాంగ్ ప్లేయర్వి.. అందుకే, నిన్ను తప్పిస్తున్నాం.. ఇది టీమ్ డెసిషన్.. వ్యక్తిగత నిర్ణయం కాదు..’ అంటూ పల్లవి ప్రశాంత్ని హౌస్ మేట్స్ కొందరు బుజ్జగించారు.
అసలు విషయమేంటంటే, హౌస్ మేట్స్ని రెండు జట్లుగా విడదీసి, టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ సందర్భంగా, ఓ టీమ్.. ఇంకో టీమ్లోని బలమైన అభ్యర్థిని ఆట నుంచి తప్పించాలి. అలా తప్పించడానికి, పల్లవి ప్రశాంత్ని ఎంచుకుంది అతని అపోజిషన్ టీమ్.
బిగ్ బాస్లో పలు టాస్క్లు.. ఈ సందర్భంగా కొన్ని ప్రక్రియలు సర్వసాధారణం. కుండల మీద ఫొటోలు పెట్టి, పగలగొట్టించడం దగ్గర్నుంచి చాలా వెకిలి వేషాలు వేయిస్తుంటాడు బిగ్ బాస్. అలా ‘డెడ్’ అనే బోర్డుని పల్లవి ప్రశాంత్ మెడలో, అపోజిషన్ టీమ్ వేయాల్సి వచ్చింది.
ఆ ఛాన్స్ పల్లవి ప్రశాంత్ టీమ్కి వచ్చి వుంటే, అపోజిషన్ టీమ్లో ఎవరో ఒకరికి ఆ బోర్డు వేసేవారే. అప్పుడు పల్లవి ప్రశాంత్, ‘ఇది అన్యాయం’ అని అనడు కదా.! రెండ్రోజులపాటు ఆట ఆడేందుకు ప్రశాంత్కి అవకాశం వుండదంతే.
అంతకు ముందు, బెలూన్స్ టాస్క్లో రెడ్ టీమ్ గెలిచింది. సింహాలు, పులులు.. అని టీమ్లు ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. కానీ, రెడ్ అండ్ యెల్లో టీమ్గానే ఈ టీమ్ల గురించి చర్చ నడుస్తోంది. సరే, అది వేరే చర్చ.
ఈ బెలూన్ల టాస్క్ కంటే ముందు, చిన్న చిన్న బాల్స్ని పై నుంచి విసిరి, రెండు టీమ్లూ వాటిని ఏరుకునేలా చేశాడు బిగ్ బాస్. వాటిని దాచుకోవాల్సి రావడం మళ్ళీ ఇరు టీమ్లకీ పెద్ద టాస్క్.
కాగా, యావర్ – అశ్విని మధ్య నామినేషన్స్ తాలూకు హీట్ ఇంకా కొనసాగుతూనే వచ్చింది. యావర్ని అశ్విని టార్గెట్ చేస్తే, ఆమెకు గట్టిగానే కౌంటర్ ఎటాక్ ఇచ్చేశాడు యావర్. ‘రతిక’ విషయంలో అశ్విని, యావర్ని టార్గెట్ చేస్తూ వస్తోంది.