బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్ టైటిల్ ను విన్ అయ్యాక పల్లవి ప్రశాంత్ పోలీసులకు సహకరించకుండా అనవసరంగా హడావిడి చేసాడని అన్నారు. ఇంకా ప్రశాంత్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించి పలు కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసారని, దీనికి గాను ప్రశాంత్ ఇంకా పలువురు ఫ్యాన్స్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.
ఇక పల్లవి ప్రశాంత్ కారు డ్రైవర్ ను, ఇద్దరు ఫ్యాన్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అలాగే పల్లవి ప్రశాంత్ ను కూడా అదుపులోకి తీసుకుందాం అనుకుంటే సడెన్ గా తను అందుబాటులో లేడని తెలుస్తోంది. ఫోన్ కూడా స్విచ్ఆఫ్ వస్తోందని అంటున్నారు.
అలాగే ప్రశాంత్ తన స్వగ్రామంకు దగ్గరగా ఉండే కొమురవెల్లి అనే గ్రామంలో ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.