వారం రోజుల క్రితం రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కత్తి మహేష్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఆ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే అతడిపై జాంబాగ్కు చెందిన మరో వ్యక్తి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి నెలలో కత్తి మహేష్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను చూపిస్తూ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసును కూడా నమోదు చేసిన పోలీసులు కత్తి మహేష్ ను మళ్లీ అరెక్ట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ రెండు కేసుల విచారణ నిమిత్తం పోలీసులు ఆయన్ను రిమాండ్ కు తీసుకున్నారు. జాతుల మద్య వైరం కలిగించే వ్యాఖ్యలను ఆయన చేసినట్లుగా కొత్త ఫిర్యాదులో ఉమేష్ కుమార్ పేర్కొన్నాడు. హిందువుల మనో భావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కావని అలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ కేసు పెట్టిన పిటీషనర్ విజ్ఞప్తి చేశాడు. పోలీసులు ఈ కేసులను త్వరిత గతిన విచారిస్తామని హామీ ఇచ్చారట.