ఏ పని చేసినా, దానికి విపరీతమైన ప్రచారం ఉండాలని కోరుకునే నేతల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరు. ప్రభుత్వపరంగా గానీ, పార్టీ పరంగా గానీ ఏ కార్యక్రమం తలపెట్టినా, దానికి సంబంధించిన ప్రచారానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. మనం చేసిన పనిని ప్రజలకు చెప్పుకోకపోతే ఎలా అని ఆయన అంటుంటారు.
అందువల్లే తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తుంటారు. మామూలు సమయంలోనే ప్రచారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే టీడీపీ.. ఇక ఎన్నికల సమయం వస్తే ఏ విధంగా దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైతం తెలుగుదేశం పార్టీ తన ప్రకటనలతో అదరగొట్టేసింది.
మహాకూటమితో జత కట్టిన తర్వాత పొలిటికల్ యాడ్స్ తో ఊదరగొట్టేసింది. ఏ పత్రిక చూసినా మహాకూటమి ప్రకటనే ఉండేది. కోట్లు వెచ్చించి భారీ స్థాయిలో ప్రచారం చేసింది. కూటమిలోకి తెలుగుదేశం పార్టీ రానంత వరకు చాలా చప్పగా ఉన్న ప్రచారం.. టీడీపీ వచ్చిన తర్వాత యాడ్స్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయాయి.
ఓ దశలో మహాకూటమి గెలుపు ఖాయమే అనే విధంగా ప్రకటనలు హోరెత్తిపోయాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నప్పటికీ, యాడ్స్ విషయంలో టీడీపీదే పైచేయిగా నిలిచింది. పొరుగు రాష్ట్రంలో కేవలం 14 సీట్లలో పోటీ చేసినప్పుడే ప్రకటనలతో దూసుకుపోయిన తెలుగుదేశం పార్టీ.. ఇక సొంత రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవడానికి ఇంకెంత స్పీడ్ తో దూసుకుపోవాలని భావిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎన్నికలకు చాలా ముందుగానే ఈ విషయంలో పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. రాజకీయ పార్టీల చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా యాడ్స్ తయారుచేయించాలని నిర్ణయించింది. అనంతరం ఈ బాధ్యతను ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పజెప్పింది.
ఆయన కూడా చాలా దృష్టిపెట్టి సినిమా స్థాయిలో యాడ్స్ తీశారు. స్క్రిప్ట్ దగ్గర నుంచి లొకేషన్ల వరకు అన్నీ కూడా సినిమా కు ఏమాత్రం తగ్గకుండా చూసుకోవడంతో ప్రకటనలన్నీ చాలా క్వాలిటీగా వచ్చాయి. ఒకటి రెండు యాడ్స్ లోని కంటెంట్ విషయంలో విమర్శలు వచ్చినప్పటికీ, క్వాలిటీ మాత్రం అదిరిపోయేలా ఉంది.
పైగా ప్రతి ఛానల్ లో ఈ యాడ్స్ అదేపనిగా వచ్చేలా ఆయా చానళ్ల స్లాట్స్ కొనేసుకోవడంతో ఏ సమయంలో ఏ ఛానల్ పెట్టినా, టీడీపీ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. ప్రకటనల విషయంలో అధికార టీడీపీ ఇంత పెద్ద ఎత్తున కసరత్తు చేయగా.. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మాత్రం తేలిపోయింది. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే పాట మినహా మిగిలిన యాడ్స్ విషయంలో టీడీపీతో పోలిస్తే చాలా వెనకబడి ఉంది.
ఈ విషయంలో ఆ పార్టీ అంతగా ఫోకస్ పెట్టకపోవడానికి కారణం ప్రశాంత్ కిషోర్ అని సమాచారం. వైఎస్సార్ సీపీకి పొలిటికల్ అడ్వైజర్ గా ఉన్న ఆయన సలహా మేరకే యాడ్స్ విషయంలో వైఎస్సార్ సీపీ అంతగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ప్రజలు యాడ్స్ చూసి ఓటేయరని, అందువల్ల ఈ విషయంలో ఏమీ అంత కసరత్తు చేయాల్సిన అవసరం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పడంతోనే ఏదో తూతూమంత్రంగానే ఆ పని కానిచ్చేశారని అంటున్నారు. మరి ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల యాడ్లు ప్రభావం చూపిస్తాయా లేక ప్రశాంత్ కిషోర్ వ్యూహం వర్కవుటుందా అనేది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడక తప్పదు.
642178 353708Hello! I would wish to supply a large thumbs up for your superb info you can have here about this post. Ill be coming back to your blog site for further soon. 964272
493770 597533I dugg some of you post as I thought they were really beneficial invaluable 603290
895320 646839Yay google is my world beater helped me to find this wonderful web web site ! . 910566