ఏ ఊళ్లోనైనా ఒకరో ఇద్దరికో పెళ్లిళ్లు కాకుండా ఉండటమో, లేదా ఆలస్యంగా జరగడమో చూస్తుంటాం. కానీ ఆ గ్రామంలోని యువత ఎవరికీ పెళ్లిళ్లు కావడంలేదు. అసలు ఆ ఊరు సంబంధం అంటేనే మాకొద్దు బాబోయ్ అనేస్తున్నారు. వారికి ఈ కష్టాలు ఎందుకంటారా? ఆ ఊరికి సరైన సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణం. బిహార్ లో తారాబడి అనే గ్రామం ఉంది. బెంగాల్ సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామం చుట్టూ నదులే. దాదాపు 800 మంది వరకు అక్క జనాభా ఉంటుంది. చుట్టూ నదులే కావడం.. ఒక్క వంతెన కూడా లేకపోవడంతో రవాణా సౌకర్యం లేదు.
దీంతో ఊరు అభివృద్ధికి నోచుకోలేదు. ఆ గ్రామంలో కనీస సదుపాయాలు కల్పిస్తామని సీఎం నితీశ్ కుమార్ వాగ్దానాలు చేసినా.. అవేవీ అమలుకాలేదు. దీంతో ఆ గ్రామంలోని యువతను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపించడంలేదు. కనీసం వంతెన కూడా లేకపోవడంతో పడవల్లోనే ఊరు దాటాల్సిన పరిస్థితి. దీంతో అక్కడి సంబంధం చేసుకోవడం ఎందుకనే భావనతో ఎవరూ అటు కన్నెత్తి చూడటంలేదు.
676097 892715Wow, awesome weblog structure! How long have you been running a weblog for? you created blogging appear easy. The total appear of your internet site is great, let alone the content material material! 569415