ప్రతిరోజూ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలపై విమర్శలూ అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో లీటర్ పెట్రోల్ సెంచరీకి చేరువలో ఉంది. ఎప్పుడు ఏ రాష్ట్రంలో 100 దాటిపోతుందో అనే అంచనాల మధ్య ఐదు రోజుల క్రితం మహారాష్ట్రలోని పర్భణిలో తొలిసారిగా 100 మార్కు దాటిని లీటర్ పెట్రోల్ ఇప్పుడు మరోచోట సెంచరీ కొట్టేసింది. అదెక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్లో.. గుంటూరులో..
అవును.. ఏపీలో తొలిసారిగా గుంటూరు నగరంలో లీటర్ ప్రీమియం పెట్రోల్ 100.13గా నమోదైంది. సాధారణ పెట్రోల్ ధర సెంచరీకి చేరువయ్యేందుకు 96.68 పైసలు వద్ద సిద్ధంగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ 96.48 గా.. లీటర్ డీజిల్ 90.08 పైసలుగా నమోదైంది. వరుసగా 12వ రోజు కూడా పెరిగిన చమురు ధరలతో గుంటూరు, విజయవాడల్లో ఈ ధరలు నమోదయ్యాయి. మరోవైపు.. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లే చమురు కంపెనీలు ఇష్టారీతిన చమురు ధరలు పెంచేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.
793520 433899Thank you for your information and respond to you. bad credit auto loans hawaii 625161
113780 319563I tried to submit a comment earlier, although it has not shown up. I will remember this. 740442