భాగమతి చిత్రం తర్వాత అనుష్క చేస్తున్న చిత్రం ‘నిశబ్దం’. హర్రర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన భాగమతి చిత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. బాహుబలి క్రేజ్ తో అనుష్క సినిమా అవ్వడంతో భాగమతి మంచి వసూళ్లను అయితే రాబట్టింది. కాని సినిమాకు సామాన్య ప్రేక్షకుల నుండి విమర్శలే వచ్చాయి. భాగమతి చిత్రం కథ మరీ విడ్డూరంగా ఉంది అంటూ అప్పుడు విమర్శలు వచ్చాయి. ఆ సినిమా గురించి పక్కన పెడితే ఇప్పుడు నిశబ్దం చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత అనుష్క రాబోతుంది.
నేడు నిశబ్దం చిత్రం టీజర్ వచ్చింది. టీజర్తో ఈ సినిమా మరో భాగమతి చిత్రంలా ఉంటుందా అనే అనుమానం కలిగేలా చేస్తుంది. భాగమతి చిత్రం తరహాలోనే నిశబ్దం కూడా దెయ్యాల కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది. ఈ సినిమాకు అదనపు ఆకర్షణ ఏంటీ అంటే ఈ సినిమాలో అనుష్క మూగ.. చెవిటి అమ్మాయిగా కనిపించబోతుంది. ఆమెకు దెయ్యం వల్ల ఎదురైన సమస్యలు ఏంటీ.. దెయ్యం చేసిన పనికి ఆమె సాక్షిగా ఎలా నిలిచింది అనేది సినిమా కథాంశం.
మాధవన్ కీలక పాత్రలో నటించడంతో పాటు అంజలి పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో షాలిని పాండే కీలక పాత్రలో కనిపించబోతుంది. ట్రైలర్ను చూస్తుంటే షాలిని పాండే ఏమైనా విలన్ అయ్యి ఉంటుందా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే హర్రర్ సినిమాలో సినిమా పూర్తి అయ్యే వరకు కూడా విలన్ ఎవరో తెలియదు. కనుక ట్రైలర్ కన్ఫ్యూజన్ను మరింత పెంచి సినిమాపై ఆసక్తిని అయితే పెంచారు. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంతో అనుష్క ఈజ్ బ్యాక్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
369709 83181Thank you for every other informative web site. Exactly where else could I get that type of information written in such a perfect indicates? Ive a mission that Im just now operating on, and Ive been at the appear out for such info. 351593
348695 20225Id always want to be update on new blog posts on this internet web site , bookmarked ! . 264442