జన్వాడలో ఉన్న కేటీఆర్ లీజ్ ఫామ్ హౌస్ పై అనుమతులు లేకుండా మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అతని అనుచరులు డ్రోన్ కెమెరాను ఎగరవేశారని చెప్పి ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టారు. ఐపీసీ 184, 187 సెక్షన్ ప్రకారం కేసులు పెట్టి ఆయన్ను రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అంతేకాదు 14 రోజులపాటు ఆయనకు రిమాండ్ విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తెరాస పార్టీకి పక్కలో బల్లెంగా మారి ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. నోటుకు ఓటు కేసు సమయంలో కుడి ఇలానే జరిగింది. ఆయన్ను అరెస్ట్ చేసి దారిలోకి తెచ్చుకోవాలని చూసినా లాభం లేకపోయింది. కొడంగల్ నియోజక వర్గంలో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు సగానికిపైగా కేడర్ మొత్తం అక్కడే ఉండి రేవంత్ ను ఓడించారు. అయితేనేం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇది తెరాస పార్టీపై రేవంత్ కు నైతిక విజయంగా చెప్పాలి.
ఎంపీగా గెలిచిన తరువాత కూడా రేవంత్ రెడ్డి తెరాస పార్టీని వదలలేదు. ఏదో విధంగా తెరాస పార్టీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా జన్వాడలో రేవంత్ రెడ్డి అతని అనుచరులు డ్రోన్ కెమెరాను కేటీఆర్ ఫామ్ హౌస్ పై ఎగరవేయడంతో అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ఎగరవేశారని తెరాస పార్టీ కేసు పెట్టింది.
అయితే, జీవో 111 ప్రకారం కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ కట్టడంగా ఉందని, రేవంత్ పై చర్యలు తీసుకున్నప్పుడు అక్రమ కట్టడమైన ఆ ఫామ్ హౌస్ యజమానిపైన, ఫామ్ హౌస్ తీసుకున్న మంత్రివర్యులు కేటీఆర్ పైనా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 111 జీవో అమలు జరగడం లేదని, యథేచ్ఛగా అక్రమ కట్టడాలు నిర్మిస్తూనే ఉన్నారని మొదట అక్రమ కట్టడాలు నిర్మించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు.
155553 741669hey was just seeing if you minded a comment. i like your website and the theme you picked is super. I is going to be back. 598863
747849 848516 Spot on with this write-up, I truly believe this website needs significantly far more consideration. Ill probably be again to read a lot a lot more, thanks for that information. 841469