Switch to English

వైఎస్సార్సీపీకి బీజేపీ కరెంట్‌ షాక్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం 2 రూపాయల 70 పైసలకే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తోందనీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 9 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మలా సీతారామన్‌. అంతే కాదు, అంతర్జాతీయంగా చేసుకున్న ఒప్పందాల్ని రాష్ట్రాలు గౌరవించాలంటూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి చురకలంటించారు.

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తూనే, విద్యుత్‌ ఒప్పందాలపై సమీక్ష జరపడం, అది కాస్తా కేంద్రానికి ఆగ్రహం తెప్పించిన విషయం విదితమే. ‘కేంద్రంతో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి.. కేంద్రం నుంచి మాకు అనుమతి వుంది..’ అంటూ విద్యుత్‌ ఒప్పందాల విషయమై వైఎస్సార్సీపీ నేతలు పలు సందర్భాల్లో ఈ వివాదంపై వ్యాఖ్యానించారు. కానీ, నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు చూస్తోంటే, విద్యుత్‌ ఒప్పందాల విషయంలో రాష్ట్రం తీరుపై కేంద్రం తీవ్ర అసహనంతో వున్నట్లే కన్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి చెడ్డ పేరు వస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ జగన్‌ సర్కార్‌కి చురకలంటించారు నిర్మలా సీతారామన్‌.

మరోపక్క, వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ముద్రపడ్డ బీజేపీ సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహారావు కూడా జగన్‌ సర్కార్‌పై ఈ రోజు మండిపడటం గమనార్హం. ‘రాష్ట్రంలో చంద్రన్న పథకాలు, ఇప్పుడు జగనన్న పథకాలు కన్పిస్తున్నాయి తప్ప, రాష్ట్రంలో అభివృద్ధి లేదు. అసలు రాష్ట్రంలో ఆయా పథకాలకు పెట్టదగిన గొప్ప వ్యక్తులే లేరా.? చంద్రబాబు పాలనకీ, వైఎస్‌ జగన్‌ పాలనకీ పెద్దగా తేడా ఏమీ లేదు.. అప్పుడూ, ఇప్పుడూ రాష్ట్రంలో ప్రజలు సంతృప్తితో లేరు..’ అని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ టూర్‌ తర్వాత, బీజేపీ నేతలు ఇంత అగ్రెసివ్‌గా వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై విరుచుకుపడటం కాకతాళీయం మాత్రమేనా.? అన్న విషయమై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...