బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం 2 రూపాయల 70 పైసలకే యూనిట్ విద్యుత్ అందిస్తోందనీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 9 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మలా సీతారామన్. అంతే కాదు, అంతర్జాతీయంగా చేసుకున్న ఒప్పందాల్ని రాష్ట్రాలు గౌరవించాలంటూ వైఎస్ జగన్ సర్కార్కి చురకలంటించారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తూనే, విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష జరపడం, అది కాస్తా కేంద్రానికి ఆగ్రహం తెప్పించిన విషయం విదితమే. ‘కేంద్రంతో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి.. కేంద్రం నుంచి మాకు అనుమతి వుంది..’ అంటూ విద్యుత్ ఒప్పందాల విషయమై వైఎస్సార్సీపీ నేతలు పలు సందర్భాల్లో ఈ వివాదంపై వ్యాఖ్యానించారు. కానీ, నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చూస్తోంటే, విద్యుత్ ఒప్పందాల విషయంలో రాష్ట్రం తీరుపై కేంద్రం తీవ్ర అసహనంతో వున్నట్లే కన్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి చెడ్డ పేరు వస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ జగన్ సర్కార్కి చురకలంటించారు నిర్మలా సీతారామన్.
మరోపక్క, వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ముద్రపడ్డ బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు కూడా జగన్ సర్కార్పై ఈ రోజు మండిపడటం గమనార్హం. ‘రాష్ట్రంలో చంద్రన్న పథకాలు, ఇప్పుడు జగనన్న పథకాలు కన్పిస్తున్నాయి తప్ప, రాష్ట్రంలో అభివృద్ధి లేదు. అసలు రాష్ట్రంలో ఆయా పథకాలకు పెట్టదగిన గొప్ప వ్యక్తులే లేరా.? చంద్రబాబు పాలనకీ, వైఎస్ జగన్ పాలనకీ పెద్దగా తేడా ఏమీ లేదు.. అప్పుడూ, ఇప్పుడూ రాష్ట్రంలో ప్రజలు సంతృప్తితో లేరు..’ అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ టూర్ తర్వాత, బీజేపీ నేతలు ఇంత అగ్రెసివ్గా వైఎస్ జగన్ సర్కార్పై విరుచుకుపడటం కాకతాళీయం మాత్రమేనా.? అన్న విషయమై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
440284 252442Does your site have a contact page? Im having trouble locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your weblog you may be interested in hearing. Either way, fantastic weblog and I look forward to seeing it develop more than time. 793945