మొదట టైటిల్ చేంజ్, ముద్ర’ నుంచి ‘అర్జున్ సురవరం’ గా, ఆ తర్వాత పలు సమస్యల వల్ల పలుసార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా నవంబర్ 29న రిలీజ్ అవుతున్న సినిమా ‘అర్జున్ సురవరం’. నవంబర్ 26న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి అతిధిగా విచ్చేసి, సినిమా బాగుందని, తప్పక చూడాలని అందరికీ చెప్పడంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.
యువ కథానాయకుడు నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. నిఖిల్ గత సినిమా ‘కిర్రాక్ పార్టీ’ తో పోల్చుకుంటే తక్కువే కావచ్చు కానీ వెరీ గుడ్ బిజినెస్ అని చెప్పాలి. ఆంధ్ర – నైజాంలో కలిపి ఈ సినిమాని సుమారు 7.2 కోట్లకి కొనుగోలు చేశారు. మిగిలిన ప్రమోషన్స్ టాక్స్ లన్నీ కలుపుకుని చూస్తే, 7.5 కోట్ల షేర్ మార్క్ ని కనుక ఈ సినిమా క్రాస్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు దక్కుతాయి.
‘అర్జున్ సురవరం’ సినిమా నిఖిల్ కెరీర్ లో ది బెస్ట్ అనేలా రిలీజ్ అవుతుండడం, గత కొంతకాలంగా ఓ మంచి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తుండడం లాంటి అంశాలు నిఖిల్ కి చాలా పెద్ద ప్లస్ కానున్నాయి. జస్ట్ ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే చాలు అనుకున్న రేంజ్ కలెక్షన్స్ వచ్చేస్తాయని సమాచారం.
బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి బ్యానర్పై టి.సంతోష్ దర్శకత్వంలో రాజ్కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
615193 617946I enjoyed reading your pleasant site. I see you offer priceless info. stumbled into this site by chance but Im confident glad I clicked on that link. You undoubtedly answered all the questions Ive been dying to answer for some time now. Will certainly come back for a lot more of this. 64486