మెగాస్టార్ చిరంజీవి, రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న సమయంలో ఓ సెక్షన్ మీడియా ఆయన మీద కక్ష కట్టేసింది. చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అభూత కల్పనలతో అనేక కథనాల్ని సదరు మీడియా సంస్థలు ప్రచారంలోకి తీసుకొచ్చాయి. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించాక, ఆ పార్టీకి వ్యతిరేకంగా మీడియా సంస్థలు వ్యవహరించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. ఆనాటి ఆ పరిస్థితుల్ని తలచుకుంటూ సినీ నటుడు, జనసేన పార్టీ నేత, మెగాబ్రదర్ నాగబాబు కొంత ఎమోషనల్ అయ్యారు.
టీవీ 9 సంస్థలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై స్పందించాల్సి వచ్చినప్పుడు, నాగబాబు చాలా హుందాగా వ్యవహరించారు. ఎక్కడా ఆ సంస్థ పేరు ప్రస్తావించకుండా, మీడియా పరంగా తమకు అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్ళి వ్యవహారంలో మీడియా వ్యవహరించిన తీరు గురించి అందరికీ తెలుసు. ఆ ఘటనతో చిరంజీవి తీవ్రంగా కలత చెందారు. అయినా మీడియా, కనీస విజ్ఞత పాటించని పరిస్థితుల్ని నాగబాబు గుర్తు చేసుకున్నారు.
‘అప్పుడే కాదు, ఇప్పుడూ మీడియా మా మీద దుష్ప్రచారం చేస్తూనే వుంది. అందుకే నేను ఫోర్త్ ఎస్టేట్ని పెద్దగా ఇష్టపడను. ఫిఫ్త్ ఎస్టేట్ ఒకటి వచ్చింది కదా. అదే, జనసేన పార్టీకి అండగా నిలిచింది. ఆ ఫిఫ్త్ ఎస్టేట్ లేకపోయి వుంటే పరిస్థితి ఎలా వుండేదో ఏమో’ అని సోషల్ మీడియా గురించి నాగబాబు చెబుతూ కొంత ఉద్వేగానికి లోనయ్యారు. నాగబాబు, జనసేన పార్టీలో చేరే ముందు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేసిన సంగతి తెల్సిందే. నందమూరి బాలకృష్ణకి వ్యతిరేకంగా తొలుత వీడియోలు పోస్ట్ చేసిన నాగబాబు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా విరుచుకుపడ్డారు.
ఇదిలా వుంటే, జనసేన పార్టీకి గత కొంతకాలంగా సోషల్ మీడియా అండగా వుంటూ వస్తోంది. సోషల్ మీడియాలో పవన్కళ్యాణ్ మద్దతుదారులు, సామాన్యులు జనసేనకు మద్దతుగా నిలిచారు. జనసేనపై మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో జనసేన సానుభూతిపరులు ఖండిస్తూ వచ్చారు, వాస్తవాల్ని జనంలోకి తీసుకెళ్ళగలిగారు. నిజానికి, జనసేన పార్టీకి ఈ స్థాయిలో సోషల్ మీడియాలో మద్దతు దొరుకుతుందని బహుశా ఆ పార్టీ అధినేత పవన్కళ్యాణ్ కూడా ఊహించి వుండరు.
చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు మీడియా, చిరంజీవి వార్తలతో పండగ చేసుకుంది. అయితే అవి చిరంజీవిని కీర్తించేలా వుండేవి. ఎప్పుడైతే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారో, చిరంజీవిపై లేనివి వున్నట్లు, వున్నవి లేనట్లు చూపించి రోడ్డుకీడ్చేందుకు ప్రయత్నించింది మీడియాలో ఓ సెక్షన్. ఇది ఆయా రాజకీయ పార్టీల ప్రోద్బలంతో జరిగిందే. జనసేన విషయంలోనూ అదే స్ట్రాటజీని కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా సంస్థలతో కలిసి అమలు చేయడానికి ప్రయత్నించినా, సోషల్ మీడియా కారణంగా ఆ పప్పులుడకలేదు. అదే విషయం నాగబాబు మాటల్లో స్పష్టమయ్యింది.
290019 820759You produced some decent points there. I looked on the internet for that problem and located many people will go in addition to with the web internet site. 183504
962647 614173Thank you for sharing with us, I believe this web site truly stands out : D. 898532