ఈమద్య కాలంలో టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు కన్నుమూశారు. అనారోగ్య కారణంతో మృతి చెందిన బాలు గారి గురించి మర్చిపోకుండానే మరో ప్రముఖ దర్శకుడు రాజన్ మృతి చెందారు. ఈ తరం ప్రేక్షకులకు ఆయన తెలియక పోవచ్చు. కాని 1970 మరియు 80 ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు. సోదరుడు నాగేంద్రతో కలిసి ఆయన దాదాపుగా 60 సినిమాలకు సంగీతాన్ని అందించారు. నాగేంద్ర రాజన్ సంగీత దర్శక ద్వయం అప్పట్లో సూపర్ హిట్ కాంబోగా చెప్పుకునే వారు. వీరి సంగీత సారధ్యంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
తెలుగు, కన్నడం మరియు తమిళంలో వీరి పాటలు వచ్చాయి. 1933లో మైసూర్ శివరాంపేట్ లో రాజన్ జన్మించారు. తక్కువ వయసులోనే రాజన్ సోదరుడు నాగేంద్రతో కలిసి సంగీత దర్శకుడిగా మారాడు. వీరిద్దరి కాంబో ఎవర్ గ్రీన్ పాటలను అందించాయి. ముఖ్యంగా కన్నడంలో వీరి పాటలకు అప్పట్లో వీరాభిమానులు ఉండే వారు. తెలుగులో వీరు రెండు రెళ్లు ఆరు, నాగమల్లి, పులి బెబ్బులి, కిలాడి దొంగలు, ఆడపడుచులు, రౌడీ పోలీస్ వంటి సినిమాలకు సంగీతాన్ని అందించారు. అప్పుల అప్పారావు అంటూ ఈతరం సినిమాకు కూడా వీరు సంగీతాన్ని అందించి సక్సెస్ అయ్యారు. రాజన్ మృతిపై టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.
759265 635834Excellent weblog here! In addition your web web site rather a great deal up quick! What host are you using? Can I get your affiliate hyperlink for your host? I wish my web site loaded up as quick as yours lol. 396442