అత్యంత ప్రజాదరణ ఉన్న ‘ముంబై మిర్రర్’, ‘పుణే మిర్రర్’ టాబ్లాయిడ్ దిన పత్రికలు ఇక రావనే వార్త పాఠకులను విస్మయపరిచేదే. డిసెంబర్ 5న వెలువడిన సంచికే వాటికి చివరిది కావడం ఎవరూ ఊహించనిది. కాకపోతే.. ఈ పత్రికలు ఇకపై వారపత్రికలుగా రానున్నాయి. ఈపేపర్ కూడా ఉంటుంది. ఈ విషయాల్ని ‘టైమ్స్ గ్రూప్’ అధికారికంగా తెలిపింది. 1.6కోట్ల మంది పాఠకులతో అత్యంత ప్రజాదరణ ఉన్న ఈ పత్రికలు కరోనా దెబ్బకు కుదేలైపోయాయి.
‘ముంబై మిర్రర్’ పత్రికపై పాఠకులకు నమ్మకం, విశ్వాసం ఎక్కువ. రోజువారీ వార్తలు, స్థానిక సమస్యలు, రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలు, సినీ సెలబ్రిటీల సందడి, ఫ్యాషన్, ఫ్యామిలీ.. ఇలా ప్రతి అంశంలో ప్రజల్లో నమ్మకం ఏర్పరచుకుంది. స్థానిక సమస్యల పరిష్కారం కోసం కూడా ముంబై మిర్రర్ సలహాలతో కూడిన కథనాలు ఇచ్చేది. ఈ పత్రికలు మూతపడటం పాఠకులకే కాకుండా ఎంతోమంది జర్నలిస్టుల ఉపాధిపై కూడా ప్రభావం చూపింది. ఇప్పటికే ముంబైలో ‘ది ఆఫ్టర్నూన్ డిస్పాచ్ అండ్ కొరియర్’.. 2019 జూలైలో, డీఎన్ఏ పత్రిక 2019 అక్టోబర్ లో మూతపడ్డాయి.
796987 877111I wish I had a dime for every bad write-up Ive read lately. I also wish other writers had your talent and style. Thank you. 673753