గత కొన్ని రోజులుగా దేశంలో పౌరసత్వంపై అనేక వాదనలు ప్రతి వాదనలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు పౌరసత్వం బిల్లును వ్యతిరేకిస్తూ అనేక ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో ఈరోజు మోడీ దీనిపై వివరణ ఇచ్చారు. ఢిల్లీలో 1700 కాలనీలను కేంద్రం అధికారికంగా గుర్తిస్తూ 40 లక్షల మందికి భూమి పట్టాలు ఇచ్చింది. దీంతో అక్కడి 40 లక్షల మందికి వసతి సౌకర్యాలు కలిగాయి. దీంతో మోడీకి ఢిల్లీ బీజేపీ ధన్యవాదం తెలియజేసేందుకు సభను ఏర్పాటు చేసింది.
ఈ సభలో మోడీ మాట్లాడారు. ప్రతిపక్షాలు పౌరసత్వంపై చేస్తున్న అలజడులు ఈ సభ ద్వారా మోడీ తిప్పికొట్టారు. ప్రతిపక్షాలు కావాలని రాదాంతం చేస్తున్నాయని మోడీ విరుచుకుపడ్డారు. కావాలని చట్టాలను పక్క దోవ పట్టిస్తున్నట్టు మోడీ పేర్కొన్నారు. బిల్లు గురించి సరిగ్గా తెలుసుకోకుండా అనవసరంగా వాదనలు చేస్తూ కేంద్రంపై అపవాదులు వేస్తున్నట్టు మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేవలం ఇప్పుడు తీసుకొచ్చింది పౌరసత్వ బిల్లు మాత్రమే అని, ఎన్ఆర్సి పై ఇంకా క్యేబినెట్ లోను, పార్లమెంట్ లోను చర్చకు రాలేదని మోడీ తెలిపిన సంగతి తెలిసిందే. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంతగా విరుద్ధమైన వాదనలు చేస్తోందో అర్ధం కావడం లేదు.
ప్రభుత్వ, జాతీయ ఆస్తులను, సామాన్యుల కడుపులు నింపే వాటిని నిరసనకారులు దౌర్జన్యంగా విద్వాంసం చేస్తున్నారని, దీని వలన వాళ్లకు ఏమొస్తుందో అర్ధం కావడం లేదని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోపం ఉంటె తనపై తీర్చుకోవాలని, తనను కావాలంటే తిట్టమని, తనపై దూషణలు చేయమని, ఇంకా అవసరం అనుకుంటే తనకు వ్యతిరేకంగా నిరసనలు, దిష్టిబొమ్మలు తగలబెట్టమని అన్నారు. అమాయకులైన ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని మోడీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఇకపోతే, పోలీసులు దేశంలో రియల్ హీరోలని, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి… పోలీసులకు మాత్రం అలానే ఉంటారు. వాళ్లకు ఎవరూ శత్రువులు ఉండరు. వారే ఈ దేశానికీ రక్షకులు అని వారిపై రాళ్ళూ రువ్వడం పద్దతి కాదని మోడీ ఈ సందర్భంగా తెలిపారు.
జాతీయ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు దేశంకోసం పోరాటం చేయాలని, టెర్రర్ పై వ్యతిరేకంగా పోరాటం చేస్తారని విశ్వసిస్తున్నట్టు మోడీ తెలిపారు. పేద ప్రజల కోసమే ఉజ్వల పధకాలు ప్రవేశ పెట్టి ఆ పధకాలు అందరికి అమలు జరిగేలా చూస్తున్నామని, మతాలతో సంబంధం లేదని అన్నారు. 8 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినపుడు వారి పేదరికం ఆధారంగా మాత్రమే ఇచ్చామని, మతాలను చూసి కాదని మోడీ పేర్కొన్నారు.
దేశంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉందని, అలానే చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత కూడా ప్రజలకు ఉందని, చట్టాలను తప్పుగా అర్ధం చేసుకునే వారి మాయలో పడొద్దని మోడీ హితవు పలికారు
600420 161439When I saw this page was like wow. Thanks for putting your effort in publishing this post. 615727
312144 684532Some truly good stuff on this site , I it. 684176
784641 706707An extremely fascinating read, I may well not concur completely, but you do make some incredibly valid points. 921441