ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా బాపట్ల పర్యటనలో పర్యాటక శాఖ ఉద్యోగి ఆమె చెప్పులు మోయడం వివాదాస్పదం అవుతోంది. గురువారం ఆమె జిల్లాలోని సూర్యలంక బీచ్ కు వెళ్లిన తర్వాత సముద్రం వద్దకు వెళ్లారు. అనంతరం అక్కడ సముద్రంలోకి వెళ్లి అలలను ఆస్వాదించారు. అయితే.. ఆమె వెళ్లేముందు చెప్పులు విడిచారు. దీంతో ఓ వ్యక్తి.. మేడమ్ చెప్పులు జాగ్రత్త అని స్థానిక పర్యాటక శాఖ ఉద్యోగులతో అన్నారు.
దీంతో మంత్రి గారి చెప్పులు.. వాటిని జాగ్రత్తగా చూసుకోకుంటే ఎటుపోయి ఎటొస్తుందోనని భయపడ్డారో.. ఏమో..! పర్యాటక శాఖ ఉద్యోగి నాగరాజు ఆమె చెప్పులు చేత్తో పట్టుకున్నారు. మంత్రి రోజా సముద్రపు నీటిలో సరాదాగా గడిపి వచ్చేవరకూ ఆయన చెప్పులను చేత్తో పట్టుకునే ఉండటం మీడియా కంటపడింది. మంత్రి వచ్చాక వాటిని వేసుకుని మిగిలిన కార్యక్రమాలకు వెళ్లారు. ప్రస్తుతం మంత్రి చెప్పులను పర్యాటక శాఖ ఉద్యోగి మోస్తున్న వీడియో, పిక్స్ వైరల్ అవుతున్నాయి. జరిగిన ఘటనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
762600 133581You produced some decent points there. I looked on the internet for that problem and located most individuals goes along with along along with your internet website. 43990
607620 447159You realize, a lot of people are looking around for this information, you could help them greatly. 863747
260397 386549Maintain websiteing stuff like this I really am fond of it 419708