మంత్రి పేర్ని నాని హైదరాబాద్ లో మోహన్ బాబు, విష్ణును కలవడం చర్చనీయాంశమైంది. సీఎంతో చిరంజీవి బృందం భేటీ జరిగిన మరుసటి రోజే ఆయన మోహన్ బాబును కలవడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ..
‘మోహన్ బాబును కలవడంపై వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. 2002, 2003 నుండి మోహన్ బాబుతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. కాఫీ కోసం పిలిస్తే ఇంటికి వెళ్లాను. కొందరు దీనిపై దుష్ర్పచారం చేస్తూ.. సీఎంతో భేటీకి మోహన్ బాబు రానందుకు వివరణ ఇచ్చేందుకు వెళ్లినట్టు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. టిక్కెట్ల వ్యవహారంపై చంద్రబాబు సమస్య సృష్టిస్తే.. దాన్ని పరిష్కరించింది జగన్’.
‘బ్లాక్ టిక్కెట్లతో ప్రజల్ని దోచుకునే సంప్రదాయానికి తెరతీసింది చంద్రబాబు. పరిశ్రమకు ఆయన చేసిందేమీ లేదు. వారిని కేవలం రాజకీయాలకు వాడుకున్నారు. సినీమా వారి సమస్యలు పరిష్కరించటమే మా ఉద్దేశం. ప్రభుత్వ సహకారానికి సినిమా వాళ్లు సంతోషించారు’ అని అన్నారు.