ఆర్ఎక్స్ 100 చిత్రంతో సక్సెస్ను దక్కించుకున్న దర్శకుడు అజయ్ భూపతి తదుపరి చిత్రంగా మహాసముద్రంను తెరకెక్కించబోతున్నట్లుగా సంవత్సరంకు ముందే ప్రకటించాడు. కాని ఇప్పటి వరకు ఆ సినిమాను మాత్రం పట్టాలెక్కించలేక పోయాడు. ఇదే సమయంలో తన మూడవ సినిమాను కూడా ప్రకటించాడు. కాని రెండు సినిమాలు కూడా ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. రెండవ సినిమాకు మహాసముద్రం అనే టైటిల్ను కూడా అనుకున్న దర్శకుడు అజయ్ భూపతి పలువురు హీరోలకు స్క్రిప్ట్ వినిపించగా చివరకు శర్వానంద్ ఓకే చెప్పాడు.
ప్రస్తుతం శర్వానంద్ చేస్తున్న శ్రీకారం పూర్తి అయిన తర్వాత మహాసముద్రంను మొదలు పెట్టాలని భావించారు. కాని తాజాగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం అయ్యేలా ఉంది. ఈ సమయంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని దర్శకుడు అజయ్ భూపతి ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. కథలో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటే తప్పకుండా నటించేందుకు ఆసక్తి చూపించే సాయి పల్లవి మహాసముద్రం చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.
ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి ఇప్పటికే శర్వానంద్తో ‘పడిపడి లేచె మనసు’ చిత్రంలో కలిసి నటించారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఇప్పటికే వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. ఇదే సమయంలో మరోసారి అజయ్ భూపతి దర్శకత్వంలో జత కట్టబోతున్నారు. మూడవ సారి వీరిద్దరు జత కట్టబోతున్నారు. త్వరలో నాగచైతన్యతో సాయి పల్లవి నటించిన లవ్స్టోరి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న మహాసముద్రం జూన్లో ప్రారంభించాలని అజయ్ భూపతి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
67444 417059some truly interesting information , well written and broadly speaking user genial . 506817