ఆంధ్రప్రదేశ్లోని విద్యా వ్యవస్థను సమూలంగా మార్చి వేసేందుకు జగన్ సర్కార్ సిద్దం అయ్యింది. విద్యా శాఖ అధికారులు మరియు ప్రముఖులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏపీలోని అన్ని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను చేర్చాలంటూ నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెల్సిందే. ఈ నిర్ణయంలో భాగంగానే ఎల్ కేజీ మరియు యూకేజీ క్లాస్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
ప్రీ ప్రైమరీ 1 మరియు ప్రీ ప్రైమరీ 2 క్లాస్లను ప్రాధమిక విధ్య పరిధిలోకి తీసుకు రావడం ద్వారా విద్యార్థులకు మరింతగా ఇంగ్లీష్ మీడియం చేరువ చేసినట్లుగా అవుతుందని ఈ సందర్బంగా అధికారులు సూచించారు. ఎల్కేజీ యూకేజీ అనేది కేవలం ప్రైవేట్ స్కూల్స్కు మాత్రమే ఉండేవి. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇవి ఉండబోతున్నాయి. ఈ విధానం ప్రస్తుతం ఏపీలోని పిల్లలందరికి కూడా ఉపయోగదాయకంగా మారబోతుందని అధికారులు అన్నారు. సీఎం జగన్ వచ్చే ఏడాది నుండే దీనిని మొదలు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
90561 932171Im often to blogging and i in actual fact respect your content. The piece has actually peaks my interest. Im going to bookmark your content material and preserve checking for brand new information. 200964
634526 480351Hello! Good post! Please do keep us posted when we can see a follow up! 553137