Switch to English

నేను రాను సర్కారు దవాఖానాకు అంటున్న సర్కారోళ్ళు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

అత్యాధునిక సదుపాయాలున్నాయి అని ఊదర గొడతారు.. ఎవ్వరూ చేయనంతగా మేమే అభివృద్ది చేశాం అని ఘనంగా చెప్పుకుంటారు ఏ మాత్రం భయపడాల్సిన పని లేదు సూపర్ స్పెషాలిటీ స్థాయి వసతులున్నాయి అని గొప్పలు చెప్పుకుంటారు.. ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు చేస్తారు,అక్కడ ప్రోటోకాల్ పాటించకుంటే రంకెలేస్తారు.

మేమే చేశాం,మా వల్లే అయ్యింది అని కోట్లు ఖర్చు చేసి ప్రచారాలు చేస్కుంటారు. ఇవన్నీ చూపించి ఓట్లు అడుగుతారు, గద్దెనెక్కుతారు, పదవులు అనుభవిస్తారు. కానీ తమ దాకా వస్తే మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులకి పరుగులు పెడుతున్నారు.

ప్రజా ప్రతినిధుల నిజ స్వరూపనికి కరోనా ఒక ఉదాహరణగా నిలిచింది.వారి నైజాన్ని ప్రజల ముందు ఉంచింది.ప్రతీ రోజు ప్రకటనల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నీ సదుపాయాలు ఉన్నాయి అని చెబుతున్నారు,కానీ ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు మాత్రం నిర్మొహమాటంగా మేము చేరం ఈ ధర్మాసుపత్రుల్లో అని అంటున్నారు.

సామాన్యుడిదీ ప్రాణమే ఈ నేతలదీ ప్రాణమే..వీరికి అవకాశం ఉంది కాబట్టి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరారు.అంటే మరి సామాన్యుడికి గతికి లేదు కాబట్టి ధర్మాసుపత్రుల్లో చేరాలా?

తమ కరకమలములచే ఆరంభింపబడిన ఆసుపత్రుల్లో చేరడానికి వీరు ఎందుకు విముఖత చూపుతున్నారు ? ప్రభుత్వ వైధ్య విధానాల పై అనుమానమా? వైద్యులపై నమ్మకం లేదా? సదుపాయాలు చాలవా? ఇది ప్రభుత్వ వైద్యులను అవమానించడం కాదా? మాటలతో ముద్దాడుతూ నొసటితో వెక్కిరించడం కాదా ఇది ??

ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేనివి వీరు ఎన్నుకునే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎమున్నాయో సదరు నేతలు చెప్పాలి.ప్రభుత్వం ఆ సౌకర్యాలు కల్పించడం లో ఎందుకు విఫలం అయ్యిందో ప్రభుత్వం వివరించాలి,తప్పులు సవరించాలి.

కరోనా వల్ల చికెన్ తింటే వ్యాధులు ప్రబలుతాయి అనే అపోహ ప్రజల్లో ఉంటే తమ సాటి మంత్రుల,నేతల పౌల్ట్రీ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అని,సాక్షాత్తూ కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న వ్యక్తి నుండి క్యాబినెట్ మంత్రుల దాకా వేదికలెక్కి మరీ చికెన్ ఆరగించి అపోహలు పోగొట్టారు.

మరి తమ తమ నియోజికవర్గ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలపై భయాందోళనలు చెందకుండా ఉండేందుకు ఏ ఒక్కరూ,ఒక్కరంటే ఒక్కరూ కూడా గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోలేదేం ?? వ్యాపారాల కోసం ఏమైనా చేస్తారు…తమ ప్రాణాల మీదకొస్తే మాత్రం తప్పించుకుంటారు.

తెలంగాణ నాయకులు ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ నాయకుల తీరి మరీ దారుణం. లాక్ డౌన్ నిబంధనలు భేఖాతరు చేస్తూ ర్యాలీలు,జాతరలు తీశారు,అశ్రద్ద వహించి వేడుకలు చేశారు,నిర్లక్ష్యంతో సామాజిక దూరం మరిచారు.తీరా పాజిటివ్ అని తేలగానే హైదరాబాద్,చెన్నైకి పరుగు లంకించుకున్నారు.ఇక్కడ స్థానికులకే బెడ్లు దొరక్క అల్లాడుతుంటే వీరు మాత్రం మా ప్రాణ రక్షణే మాకు ముఖ్యం అన్నట్లు వ్యవహస్తున్నారు.

నలుగురికి స్ఫూర్తిగా నిలిచి ఆదర్శ ప్రాయంగా ఉండే నాయకులు ఎవరూ లేరని రోజుకొకరు రుజువు చేస్తున్నారు..పచ్చి అవకాశ వాదులు వీరంతా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...