అత్యాధునిక సదుపాయాలున్నాయి అని ఊదర గొడతారు.. ఎవ్వరూ చేయనంతగా మేమే అభివృద్ది చేశాం అని ఘనంగా చెప్పుకుంటారు ఏ మాత్రం భయపడాల్సిన పని లేదు సూపర్ స్పెషాలిటీ స్థాయి వసతులున్నాయి అని గొప్పలు చెప్పుకుంటారు.. ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు చేస్తారు,అక్కడ ప్రోటోకాల్ పాటించకుంటే రంకెలేస్తారు.
మేమే చేశాం,మా వల్లే అయ్యింది అని కోట్లు ఖర్చు చేసి ప్రచారాలు చేస్కుంటారు. ఇవన్నీ చూపించి ఓట్లు అడుగుతారు, గద్దెనెక్కుతారు, పదవులు అనుభవిస్తారు. కానీ తమ దాకా వస్తే మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులకి పరుగులు పెడుతున్నారు.
ప్రజా ప్రతినిధుల నిజ స్వరూపనికి కరోనా ఒక ఉదాహరణగా నిలిచింది.వారి నైజాన్ని ప్రజల ముందు ఉంచింది.ప్రతీ రోజు ప్రకటనల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నీ సదుపాయాలు ఉన్నాయి అని చెబుతున్నారు,కానీ ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు మాత్రం నిర్మొహమాటంగా మేము చేరం ఈ ధర్మాసుపత్రుల్లో అని అంటున్నారు.
సామాన్యుడిదీ ప్రాణమే ఈ నేతలదీ ప్రాణమే..వీరికి అవకాశం ఉంది కాబట్టి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరారు.అంటే మరి సామాన్యుడికి గతికి లేదు కాబట్టి ధర్మాసుపత్రుల్లో చేరాలా?
తమ కరకమలములచే ఆరంభింపబడిన ఆసుపత్రుల్లో చేరడానికి వీరు ఎందుకు విముఖత చూపుతున్నారు ? ప్రభుత్వ వైధ్య విధానాల పై అనుమానమా? వైద్యులపై నమ్మకం లేదా? సదుపాయాలు చాలవా? ఇది ప్రభుత్వ వైద్యులను అవమానించడం కాదా? మాటలతో ముద్దాడుతూ నొసటితో వెక్కిరించడం కాదా ఇది ??
ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేనివి వీరు ఎన్నుకునే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎమున్నాయో సదరు నేతలు చెప్పాలి.ప్రభుత్వం ఆ సౌకర్యాలు కల్పించడం లో ఎందుకు విఫలం అయ్యిందో ప్రభుత్వం వివరించాలి,తప్పులు సవరించాలి.
కరోనా వల్ల చికెన్ తింటే వ్యాధులు ప్రబలుతాయి అనే అపోహ ప్రజల్లో ఉంటే తమ సాటి మంత్రుల,నేతల పౌల్ట్రీ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అని,సాక్షాత్తూ కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న వ్యక్తి నుండి క్యాబినెట్ మంత్రుల దాకా వేదికలెక్కి మరీ చికెన్ ఆరగించి అపోహలు పోగొట్టారు.
మరి తమ తమ నియోజికవర్గ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలపై భయాందోళనలు చెందకుండా ఉండేందుకు ఏ ఒక్కరూ,ఒక్కరంటే ఒక్కరూ కూడా గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోలేదేం ?? వ్యాపారాల కోసం ఏమైనా చేస్తారు…తమ ప్రాణాల మీదకొస్తే మాత్రం తప్పించుకుంటారు.
తెలంగాణ నాయకులు ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ నాయకుల తీరి మరీ దారుణం. లాక్ డౌన్ నిబంధనలు భేఖాతరు చేస్తూ ర్యాలీలు,జాతరలు తీశారు,అశ్రద్ద వహించి వేడుకలు చేశారు,నిర్లక్ష్యంతో సామాజిక దూరం మరిచారు.తీరా పాజిటివ్ అని తేలగానే హైదరాబాద్,చెన్నైకి పరుగు లంకించుకున్నారు.ఇక్కడ స్థానికులకే బెడ్లు దొరక్క అల్లాడుతుంటే వీరు మాత్రం మా ప్రాణ రక్షణే మాకు ముఖ్యం అన్నట్లు వ్యవహస్తున్నారు.
నలుగురికి స్ఫూర్తిగా నిలిచి ఆదర్శ ప్రాయంగా ఉండే నాయకులు ఎవరూ లేరని రోజుకొకరు రుజువు చేస్తున్నారు..పచ్చి అవకాశ వాదులు వీరంతా అనడంలో ఎలాంటి సందేహం లేదు.
911445 411055In the event you are viewing come up with alter in most with the living, starting point generally L . a . Weight reduction cutting down on calories platform are a wide stair as part of your attaining that most agenda. weight loss 455381