కొన్ని రోజులుగా ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామన్యులకే కాదు ఏకంగా ప్రజా ప్రతినిధులను కరోనా భూతం వెంటాడుతోంది. ఇటివల నియోజకవర్గాల్లో పర్యటించిన వారికీ.. పర్యటించని వారిక కూడా వైరస్ సోకుతోంది. రీసెంట్ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ రావడం తెలిసిన విషయమే. ఇప్పుడు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజటివ్ వచ్చింది.
ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు జరిపిన స్వాబ్ టెస్టులో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో ఒకసారి నెగటివ్ రాగా.. మరోసారి జరిపిన పరీక్షలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఎమ్మెల్యేకు కరోనా సోకినట్టు తెలిపారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలో కరోనా సోకుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో కలిపి ఇప్పటివరకూ నలుగురు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఎస్.కోట ఎమ్మెల్యే శ్రీనివాసులు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలకు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా రోజుకు 2వేల నుంచి 5వేల లోపు పాజిటివ్ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
650370 346233I surely did not realize that. Learnt some thing new these days! Thanks for that. 754974
94955 86051Fantastic post, Im searching forward to hear much more from you!! 708236
868054 231688Oh my goodness! a fantastic post dude. Thanks Nevertheless My business is experiencing issue with ur rss . Dont know why Not able to sign up for it. Possibly there is any person obtaining identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 834768
553130 615446Some times its a discomfort within the ass to read what weblog owners wrote but this internet website is actually user genial ! . 35490