వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు సుదీర్ఘ పోరాటం సాగిస్తున్నారు. అలుపు ఎరుగకుండా వారు చేస్తున్న పోరాటంతో కేంద్ర ప్రభుత్వం కు పెద్ద తలనొప్పిగా మారింది. చట్టాలు సవరించేందుకు కొన్ని రోజులు వాయిదా వేసేందుకు కేంద్రం ఓకే చెప్పినా కూడా పూర్తిగా చట్టాలను వెనక్కు తీసుకుంటేనే తమ ఉద్యమంను ఆపేది అంటూ రైతులు తేల్చి చెప్పారు. నేడు గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఢిల్లీలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించేందుకు రైతులు పోలీసుల అనుమతి తీసుకున్నారు. అందుకు సంబంధించిన అనుమతులు రావడంతో నేడు ట్రాక్టర్ల ర్యాలీ వస్తుంది.
ట్రాక్టర్ల ర్యాలీ భారీ ఎత్తున ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం అయిదు వేల మందికి అయిదే వేల ట్రాక్టర్లకు మాత్రమే అనుమతులు వచ్చాయి. కనుక ఢిల్లీలో రైతులు ఆ మేరకు మాత్రమే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలంటూ పోలీసులు చెప్పారు. కాని పరిస్థితి చూస్తుంటే ఎక్కువ ట్రాక్టర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల తర్వాతే ఈ ర్యాలీ ప్రారంభం అయ్యింది.