వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలు ఇంకా చల్లారట్లేదు. ఇటివల వారు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో వారు ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే.. వారు ఢిల్లీ కి చేరుకోవడమే కాదు.. ఏకంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురేసి సంచలనం రేపారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారు ఎర్రకోటను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎర్రకోట బురుజుల పైకి చేరుకుని ఫ్లాగ్ పోల్పై జెండాలు ఎగరేశారు.
రిపబ్లిక్ డే పరేడ్ కంటే ముందే ఉదయమే ట్రాక్టర్ ర్యాలీతో ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా వాటిని దాటుకుని వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు.. లాఠీచార్జి చేశారు. ఇంతలో ఐటీఓ వద్ద రైతులు-పోలీసుల మధ్య ఘర్షణ జరగడం.. ఒక గ్రూపు ఎర్రకోట వైపు దూసుకువెళ్లడం జరిగిపోయాయి. దీంతో ఎర్రకోట పైకి చేరుకున్న రైతులు, ఆందోళనకారులు ఎర్రకోట బురుజులపై జెండాలు చేతబట్టి హడావిడి చేశారు.
626133 256245Yeah bookmaking this wasnt a risky determination outstanding post! . 102870
280833 540859Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your weblog and appear forward to new posts. 770100