Jitendar Reddy: ప్రభాస్ (Prabhas) తో మిర్చి, బాహుబలి (Bahubali) సినిమాల్లో నటించిన రాకేశ్ వర్రే (Rakesh Varre) హీరోగా వస్తున్న సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jitendar Reddy). 1980ల్లో జగిత్యాలలో జరిగిన యాదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తెరకెక్కించిన విరించి వర్మ దర్శకత్వంలో నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకుంది చిత్ర యూనిట్.
దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే రిలీజైన ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. హీరోని రివీల్ చేయకుండా రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. సినిమాకు ఇది మంచి పబ్లిసిటీలా ఉపయోగపడింది. గ్రౌండ్ వర్క్ చేసి రియలిస్టిక్ లొకేషన్లలో సినిమాను తెరకెక్కించా’మని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ.. ‘జితేందర్ రెడ్డి కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా యాక్షన్ నేపథ్యంలో సినిమా తెరకెక్కించారు. లవ్ స్టోరీస్ తో మెప్పించిన రాకేశ్ యాక్షన్ హీరోగానూ మెప్పించాడు. సినిమాను మే3న విడుదల చేయబోతున్నాం. జ్ఞానవేల్ సినిమాటోగ్రఫీ, గోపీసుందర్ సంగీతం సినిమాకు ఎస్సెట్ అవుతాయ’ని అన్నారు.