మూడు రాజధానులను సీఎం జగన్ వదిలేసినట్టే అనిపిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘2024 వరకూ హైదరాబాదే ఏపీకి రాజధాని అని బొత్స చేసిన ప్రకటన చూస్తుంటే మూడు రాజధానులను జగన్ వదిలేసినట్టే అనిపిస్తోంది. అందుకే బొత్స అలా స్పిందించారని అనుకుంటున్నా. సీఎంకు తెలీకుండా బొత్స అలా మాట్లాడి ఉండరని భావిస్తున్నా’.
‘తెలంగాణలో ఒక్కసారిగా 91వేల ఉద్యోగాల ప్రకటన చరిత్రలో ఇదే మొదటిసారి. దేశంలో ఎక్కడా ఇలా జరిగలేదు. సీఎం కేసీఆర్ కు ఈ ప్రకటనతో యూత్ లో మంచి క్రేజ్ రావడం ఖాయం. ఏపీలో జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు. సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా అపాయింట్ మెంట్ దొరకట్లేదు. అపాయింట్ మెంట్ ఖరారైతే పిలుస్తామని చెప్పారు. సీఎంలను కలిసేందుకు గతంలోలా పరిస్థితులు లేవు ఏపీలో మంత్రులకే సీఎం అపాయింట్ మెంట్ దొరకటం లేదు’ అని అన్నారు.
369395 390708You could certainly see your skills within the work you write. 20545
636459 955500So funcy to see the article within this blog. Thank you for posting it 190102