Switch to English

కట్టిన ఇళ్ళు ఎందుకు ఇవ్వరు.? జనసేన, బీజేపీ ఉమ్మడి పోరాటం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గూడు లేని పేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చే పథకాన్ని చాలా కాలం క్రితమే ప్రారంభించింది. 2014 నుంచి 2019 వరకూ పెద్దయెత్తున ఇళ్ళు నిర్మించేందుకు అటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం విదితమే. అయితే, కొన్ని కారణాలతో ఆ ఇళ్ళను లబ్దిదారులకు కేటాయించడంలో అలసత్వం ఏర్పడింది. ’జి ప్లస్‌ 3’ ప్రాతిపదికన ఫ్లాట్ల నిర్మాణం జరిగింది. లబ్దిదారుల ఎంపిక కూడా చాలావరకు పూర్తయ్యింది. అయినా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ ఇళ్ళను లబ్దిదారులకు అందించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ జనసేన పార్టీతోపాటు బీజేపీ రేపు ఆందోళనలు చేపట్టనుంది.

బీజేపీ, జనసేన శ్రేణులు ఎక్కడికక్కడ ఈ ఆందోళనలు చేపడ్తాయని రెండు పార్టీల తరఫున ప్రకటనలు వెలువడ్డాయి. ఈ విషయమై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్పరెన్స్‌ నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజానికి, ఇంత పెద్దయెత్తున కేంద్రం, రాష్ట్రానికి ఇళ్ళను కేటాయించడం వెనుక ప్రస్తుత ఉప రాష్ట్రపతి, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చూపిన చొరవ అంతా ఇంతా కాదు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా కేంద్రం రాష్ట్రానికి ఇళ్ళను కేటాయించింది.

ప్రస్తుత ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాల్ని ఇవ్వాలనుకోవడాన్ని తప్పు పట్టలేం. కానీ, ఆ పథకం చుట్టూ అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. మార్చి నెలాఖరున ఇవ్వాల్సిన ఇళ్ళ పట్టాలు ఇప్పటిదాకా ఓ కొలిక్కి రాలేదు. ఆగస్ట్‌ 15న ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా, కోర్టు కేసుల తలనొప్పి నేపథ్యంలో అప్పటికైనా ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా.? లేదా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. అయినా, ఆల్రెడీ అన్ని హంగులతో ఫ్లాట్ల నిర్మాణం జరిగి వున్నప్పుడు, వాటిని ముందుగా లబ్దిదారులకు ఇచ్చేయాలి కదా.! అలా ఇచ్చేస్తే, చంద్రబాబుకి పేరొస్తుందనో, నరేంద్ర మోడీకి పేరొస్తుందనో బహుశా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ ఒకింత ఇబ్బంది పడుతున్నట్లుంది.

ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి విషయమ్మీద కూడా పార్టీ శ్రేణులతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంగా టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుని జనసేనాని తప్పు పట్టారు. పార్టీ శ్రేణులు, ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సత్తా చాటాలని పిలుపునిచ్చారు జనసేనాని.

కట్టిన ఇళ్ళు ఎందుకు ఇవ్వరు.? జనసేన, బీజేపీ ఉమ్మడి పోరాటం.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...