రైతు భరోసా, అమ్మ ఒడి.. ఇలా కుప్పలు తెప్పలుగా సంక్షేమ పథకాల్ని ప్రకటించేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి. సంక్షేమ పథకాల్ని తప్పు పట్టలేం. అది ప్రజలకు దక్కాల్సిన వాటానే. ప్రజలకు ఏ ప్రభుత్వం ఎంత ఎక్కువ సాయం చేసినా ఇంకా సరిపోదు. ఎందుకంటే, రాజకీయ నాయకులు దోచుకునేదాంతో పోల్చితే, ప్రజలకు సంక్షేమ పథకాలతో దక్కేది ‘పప్పు బెల్లం’తో సమానం.. అంటారు ప్రజాస్వామ్యవాదులు.
తాజాగా, చేనేత కార్మికులకు ఆర్థిక సాయం చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 24 వేల రూపాయలు.. అదీ ఒకే దఫా అందించే పథకానికి వైఎస్ జగన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా ముందు ముందు చాలా పథకాలు అమల్లోకి రాబోతున్నాయి. వాటి కోసం వేల కోట్లు వెచ్చించక తప్పని పరిస్థితి.
కానీ, ఆంధ్రప్రదేశ్ ఖజానా పరిస్థితేంటి.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. వ్యవసాయ అవసరాలతోపాటు, పారిశ్రామిక అవసరాలు కూడా తీరతాయి. రాజధాని అమరావతి నిర్మితమైతే.. పెట్టుబడులు వచ్చి పడ్తాయి. వాటి విషయంలో మాత్రం శీతకన్నేసిన వైఎస్ జగన్ సర్కార్, సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టే విషయమై అత్యుత్సాహం చూపుతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే 100శాతం ఎన్నికల హామీలు నెరవేర్చేశామని అన్పించుకోవాలన్నది వైఎస్ జగన్ తపనగా కన్పిస్తోంది. మంచిదే.. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల హామీల్ని నెరవేరిస్తే అది తప్పు.. అని ఎలా అనగలం.? కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఏ ప్రభుత్వమైనా ముందడుగు వేయాలి. అభివృద్ధి గురించి ఆలోచించకుండా సంక్షేమ పథకాలతోనే నెట్టుకొచ్చేస్తామంటే ఎలా.? ఆయా సంక్షేమ పథకాలకు నిధుల కొరత వస్తే.. ఇప్పుడు చేస్తున్న పబ్లిసిటీ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని జగన్ ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో.!
328768 549680This blog genuinely is very good. How was it produced ? 462995
938671 528935Maximize your by how a large amount of gear are employed internationally and will often impart numerous memory using that your is also fighting that is a result from our team rrnside the twenty 1st centuries. every day deal livingsocial discount baltimore washington 502535