Switch to English

ఇది క్లియర్.! హైద్రాబాదే ఆంధ్రప్రదేశ్ రాజధాని.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఇంతకన్నా భావదారిద్ర్యం ఇంకేమైనా వుంటుందా.? ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి, ఎనిమిదేళ్ళయినా.. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? అంటే, పొరుగు రాష్ట్రం తెలంగాణలోని హైద్రాబాద్.. అదే విభజన చట్టం ఉమ్మడి రాజధాని గనుక, ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని హైద్రాబాదే.. అని చెప్పడాన్ని ఏమనుకోవాలి.?

అదేంటో, మంత్రి బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. అని ఒప్పుకోవడానికి అస్సలేమాత్రం సుముఖత వ్యక్తం చేయడంలేదు. అమరావతిని ఎడారిగా అభివర్ణించారు.. అమరావతిని ముంపు ప్రాంతమన్నారు.. అమరావతిని ఓ సామాజిక వర్గానికి మాత్రమే రాజధాని అన్నారు.. అమరావతిని ఓ పార్టీకి రాజధానిగా చెప్పుకొచ్చారు.. ఇప్పుడేమో, హైద్రాబాదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెబుతున్నారు.

నిజమే, 2024 వరకు హైద్రాబాద్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని. తెలంగాణకు అసలు సిసలు రాజధాని. కానీ, పరాయి రాష్ట్రంలో వుండి ఎన్నాళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించుకోగలం.? ఈ ఆలోచనతోనే చంద్రబాబు, అమరావతిని రాజధానిగా ప్రకటించారు తన హయాంలో. కాదు కాదు, అప్పటి అసెంబ్లీ తీర్మానించింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని. అందుకు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మద్దతిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాబట్టే, ఆ అమరావతిని తాము గుర్తించాము కాబట్టే తమ అధినేత వైఎస్ జగన్ అమరావతిలో ఇల్లు కట్టుకున్నారని కూడా అప్పట్లో వైసీపీ నేతలు చెప్పారు. అమరావతిని రాజధానిగా చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తామనీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ తర్వాత మాట తప్పారు.

మూడు రాజధానుల ఆలోచన ప్రభుత్వానికి వుండొచ్చు. అది ఓ సారి చట్ట రూపం దాల్చినా, అది చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. స్వయంగా వైఎస్ జగన్ ప్రభుత్వమే తాము తెచ్చిన మూడు రాజధానుల చట్టాన్ని చింపి చెత్తబుట్టలో పడేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మూడు రాజధానులంటారు.? మూడు రాజధానులని అంటే అన్నారుగానీ.. హైద్రాబాద్ ప్రస్తావన ఇప్పుడెందుకు.?

అంటే, అమరావతీ లేదు.. మూడు రాజధానులూ లేవు.. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అనేదే లేదు, వుండబోదని స్పష్టమైన సంకేతాల్ని వైసీపీ ప్రభుత్వం ఇచ్చేస్తోందని బొత్స మాటల్ని బట్టి అర్థం చేసుకోవాలేమో.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...