Google Pay : జనాలు అలవాటు పడే వరకు ఉచితంగా ఇచ్చి, అలవాటు పడ్డ తర్వాత చార్జీలు వసూళ్లు చేయడం జియో సంస్థ మొదలు పెట్టింది. చాలా నెలలు డేటాను ఉచితంగా ఇచ్చిన జియో ఒక్కసారిగా భారీ రేట్లు పెట్టింది. అలవాటు పడ్డ జనాలు ఆ రేట్లకు ఓకే చెప్పి జియో వినియోగం ను కొనసాగించడం మనం చూశాం.
ఇప్పుడు యూపీఐ యాప్స్ కూడా అదే దారిలో నడుస్తున్నాయి. ఇన్ని రోజులు ఫ్రీ సర్వీస్ ను ఇచ్చిన ఈ యాప్ లు ఇప్పుడు సర్వీస్ చార్జ్ లు వసూళ్లు చేయబోతున్నాయి. చాలా మంది ఈ యూపీఐ యాప్ లను మొబైల్ రీచార్జ్ ల కోసం వినియోగిస్తున్నారు. ఎవరైతే మొబైల్ రీచార్జ్ కోసం ఈ యాప్స్ ని వినియోగిస్తారో వారి వద్ద నుంచి డబ్బులు వసూళ్లు చేయబోతున్నారు.
పోన్ పే, పేటీఎం లు ఇప్పటికే రీచార్జ్ పై కన్వీనియన్స్ ఫీజు ను వసూళ్లు చేస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ పే కూడా రీచార్జ్ పై కన్వీనియన్స్ ఫీజ్ ను వసూళ్లు చేయడం మొదలు పెట్టబోతుంది. వంద లోపు రీచార్జ్ పై ఎలాంటి కన్వీనియన్స్ ఫీజ్ లేదు. 100 నుంచి 200 రూపాయల రీచార్జ్ పై ఒక రూపాయి మరియు 200 నుంచి 300 రూపాయల రీఛార్జ్ పై రెండు రూపాయలు, మూడు వందలకు పైగా ఉన్న రీచార్జ్ పై మూడు రూపాయలు కన్వీనియన్స్ ఫీజ్ ను గూగుల్ పే వసూళ్లు చేయబోతుంది. మొత్తానికి అలవాటు చేసి ఇలా వాయించడం ఏమాత్రం బాగాలేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.