Deep Fake : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా డీప్ ఫేక్ టెక్నాలజీ భయపెడుతున్న విషయం తెల్సిందే. రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియా ను కుదిపేసిన విషయం తెల్సిందే. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే రంగంలోకి దిగి డీప్ ఫేక్ పై కఠినంగా పోరాడేందుకు సిద్దం అంటూ ప్రకటించింది.
కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లతో కలిసి డీప్ ఫేక్ వీడియోలు మరియు ఫోటోల నియంత్రణ కి ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కఠిన శిక్షలు అమలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు.
డీప్ ఫేక్ ను నియంత్రించేందుకు గాను ప్రత్యేక చట్టం ను తీసుకు వచ్చేందుకు కూడా సిద్ధం అన్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానం ను తప్పుగా వినియోగించడం ఏమాత్రం సరి కాదు. అందుకే మేము డీప్ ఫేక్ నియంత్రణ కి ముసాయిదా పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు.