విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. గత కొంతకాలంగా టీడీపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న గంటా శ్రీనివాసరావుకి, ఉక్కు ఉద్యమం భలేగా కలిసొచ్చింది. నిజానికి, ఆయన ఇప్పటిక రెండు సార్లు రాజీనామా చేసేశారు.. అదేనండీ, రాజీనామా లేఖల్ని తయారు చేసుకుని, స్పీకర్కి పంపేశారు. అయితే, వాటికి ఇంకా ఆమోదం లభించలేదు.
ఈ నేపథ్యంలో తనది ఉత్తుత్తి రాజీనామా.. అని అందరూ విమర్శిస్తుండడంతో ఇంకో అడుగు ముందుకేసి, స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు గంటా శ్రీనివాసరావు. ‘నా రాజీనామాను ఆమోదించండి..’ అని స్పీకర్ తమ్మినేనికి గంటా విజ్ఞప్తి చేశారు. అయితే, తమ్మినేని ఆ రాజీనామాని ఆమోదిస్తారా.? లేదా.? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
‘అమరావతికి వెళ్ళి రాజీనామాను పరిశీలిస్తాను..’ అని మాత్రమే తమ్మినేని నుంచి గంటా శ్రీనివాసరావుకి సమాధానం వచ్చిందట. టీడీపీలో అంతర్గత కలహాల కారణంగా ఇటీవల జరిగిన గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తడబడిన విషయం విదితమే. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని కూడా టీడీపీ క్యాష్ చేసుకోలేకపోయింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని చంద్రబాబు బుజ్జగించి వుంటే, టీడీపీకి మెరుగైన ఫలితాలు వచ్చి వుండేవే. ‘గంటా వైసీపీలో చేరబోతున్నారు..’ అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రచారం కొంతమేర వైసీపీకి కలిసొచ్చింది.
ఏదిఏమైనా గంటా శ్రీనివాసరావు రాజకీయాలు చిత్ర విచిత్రంగా వుంటాయి. అయితే, గతంలోలా ఆయన పాచికలు పారడంలేదు. ప్రతి వ్యవహారమూ దాదాపుగా బెడిసికొట్టేస్తూనే వుంది. లేకపోతే, ఈపాటికి ఆయన వైపీలోకి వెళ్ళిపోయి ఏదో ఒక కీలక పదవిలో వుండేవారే.
544731 271796Thank you for your great post! It has long been very insightful. I hope that youll continue sharing your wisdom with us. 463377
850481 668720Youve actually written a extremely great quality post here. Thank you quite much 925015