విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రి అయిన రమేష్ హాస్పిటల్స్ వారు కరోనా నేపథ్యంలో నగరంలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ను లీజ్కు తీసుకుని కరోనా ఆసుపత్రిగా మార్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అక్కడ సరైన భద్రత ప్రమాణాలు పాటించని కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
తెల్లవారు జామున ఈ మంటలు అంటుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఆసుపత్రిలో మొత్తం 40 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిలో 30 మంది కోవిడ్ బాధితులు మరో 10 మంది సిబ్బంది.
ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లుగా ప్రాధమిక సమాచారం అందుతోంది. మరికొందరు తీవ్ర గాయాలతో వేరు వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హోటల్ను ఆసుపత్రిగా మార్చే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టినట్లుగా ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
బ్రేకింగ్: విజయవాడ లో కోవిడ్ సెంటర్ గా వున్న స్వర్ణప్యాలెస్ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం.
🔹3 గురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం
🔹ప్రమాద సమయంలో 30 మంది కరోనా రోగులు.
🔹తెల్లవారుజామున 5 గంటల సమయంలో అగ్నిప్రమాదం.#TDPTwitter #TDP #YSRCP #Vijayawada #janasenaparty #AndhraPradesh pic.twitter.com/rD2ZaX4D20
— TeluguBulletin.com (@TeluguBulletin) August 9, 2020
326765 439487I was seeking at some of your articles on this website and I believe this internet website is truly instructive! Maintain on posting . 136611