భద్రాచలం అసెంబ్లీ నియోజక వర్గం నుండి మూడు సార్లు కమ్యూనిస్టు పార్టీ నుండి పోట చేసి గెలుపు సాధించిన మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి అనారోగ్య కారణంతో మృతి చెందారు. 95 ఏళ్ల కుంజా గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతు తుది శ్వాస విడిచినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. సుధీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయనకు స్థానికులు నివాళ్లు అర్పిస్తున్నారు.
1970లో కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయిన కుంజా సీపీఎం పార్టీ తరపున ప్రజా ఉద్యమంలో పాల్గొన్నాడు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన ఎన్నో ప్రజా సమస్యల పట్ల పోరాటంను చేయడం జరిగింది. 2018లో కుంజా భార్య మృతి చెందారు. ఈయనకు ఇద్దరు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కుంజా మృతి పట్ల రాష్ట్ర స్థాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సంతాపం తెలియజేశారు. ఆయన మృతి తీరని లోటు అంటూ ముఖ్య నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
198528 718505Some truly marvelous work on behalf with the owner of this web website , dead great articles . 212859
317053 500188Many thanks for the amazing post C Id fun reading it! That i enjoy this weblog. 365601