విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో సురేశ్ బాబుపై బదిలీ వేటు పడింది. దుర్గగుడిలో అక్రమాలు జరిగినట్టు కథనాలు రావడంతో ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. ఇప్పటికే దుర్గగుడిలో ఏసీబీ విచారణలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. రీసెంట్ గా అమ్మవారికి భక్తులు సమర్పించే చీరల విషయంలో కూడా అవకతవకలు వెలుగుచూశాయి. ఈనేపథ్యంలో మూడు రోజుల క్రితం ఈవో సురేశ్ బాబు అక్కమాలపై ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. మరో నెల రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుందని తెలుస్తోంది.
అమ్మవారికి చెందిన వందల కోట్ల భూములు, ఆస్తుల రక్షణను ఆలయ అధికారులు పట్టించుకోవడంలేదని.. మూడేళ్లకోసారి అమ్మవారి ప్రాపర్టీ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉన్నా చేయడం లేదని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. పదేళ్ల నుంచీ ఈ అప్డేట్ లేదని ఏసీబీ పేర్కొంది. దీనివల్ల అమ్మవారి ఆస్తులకు భారీ నష్టం చేకూరుతోందని పేర్కొంది. ఈనేపథ్యంలో దుర్గగుడికి నూతన ఈవోను ప్రభుత్వం నియమించనుందని తెలుస్తోంది.
197258 751711Theres noticeably a bundle to discover out about this. I assume you produced certain good points in attributes also. 45029
63832 206970I dont leave plenty of comments on a great deal of blogs each week but i felt i had to here. Do you require numerous drafts to make a post? 437611