విమానాల్లో తోటి ప్రయాణికులపై వరుసగా జరుగుతున్న అసభ్య ప్రవర్తన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటివల ఎయిరిండియా విమానాల్లో మద్యం మత్తులో మహిళపై, మరో మహిళ దుప్పటిపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటనలు మరువక ముందే ఎయిర్ హోస్టెస్ పై ముగ్గురు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలవరపెడుతోంది.
ముగ్గురు ప్రయాణికులు మద్యం తాగి మత్తులో ఫ్లైట్ అటెండెంట్ తో అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన కెప్టెన్ పై దాడి చేశారు. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి పట్నా వెళ్లిన ఇండిగో విమానంలో జరిగిందీ ఘటన. మద్యం మత్తులో ముగ్గురు యువకులు ఈ వేధింపులకు పాల్పడ్డారు. అడ్డుకోబోయిన కెప్టెన్ పై కూడా దాడికి దిగారు.
దీంతో విమాన సిబ్బంది ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించారు. రాత్రి 10గంటలకు విమానం విమానాశ్రయం చేరుకోగానే సీఐఎస్ఎఫ్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారవగా అతడి కోసం గాలిస్తున్నారు. వీరంతా బీహార్ కు చెందినవారేనని తెలుస్తోంది.
477417 562615Hello Guru, what entice you to post an post. This write-up was very fascinating, specifically since I was searching for thoughts on this topic last Thursday. 74321
386425 130896Keep all of the articles coming. I enjoy reading via your points. Cheers. 651994