టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పందెంకోళ్లు రెడీ అయ్యాయి. ఈసారి రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమాలు పోటీకి దిగుతున్నాయి. దీంతో ఈ చిత్రాల్లో ఏది విజయం సాధిస్తుందా.. ఏది వెనకబడిపోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలంటూ అభిమానులు కోరుతుండగా, తాను కూడా తెలుగువాడినేనంటూ దిల్ రాజు ‘వారిసు’ చిత్రాన్ని జనవరి 11న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.
ఇద్దరు స్టార్ హీరోలు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుండగా.. తమిళ హీరోలు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తెగింపు’ అంటూ దూసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు దిల్ రాజు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. విజయ్ వారసుడు సినిమాను జనవరి 11న కాకుండా, తెలుగు హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేకే తీసుకొచ్చేందుకు డేట్ను మార్చుకున్నాడు.
తాజాగా ఈమేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశాడు. వారసుడు సినిమాను తెలుగులో వాయిదా వేసి జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. అయితే తమిళంలో మాత్రం ఈ సినిమా జనవరి 11నే రిలీజ్ కానుంది. ఏదేమైనా తెలుగు స్టార్ హీరోల దెబ్బకి దిల్ రాజు వెనకడుగు వేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
Good post! We will be linking to this particularly great post on our site. Keep up the great writing
You have noted very interesting details! ps decent web site.