సాధారణ రోజుల్లో పబ్లిసిటీ స్టంట్లు చేస్తే అదో లెక్క. కానీ, కరోనా కాటేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పబ్లిసిటీ స్టంట్లు చేయడమెందుకు.? పది మందికి ‘మంచి’ చెప్పాల్సిన ప్రజా ప్రతినిథులు, పబ్లిసిటీ స్టంట్ చేయడం ద్వారా, కరోనా వ్యాప్తికి కారకులుగా మారడమెందుకు.? జనం కోసమే ప్రజా ప్రతినిథులు.. ఆ జనానికి సేవ చేసేందుకే ప్రజా ప్రతినిథులు. కానీ, ఇది ఒకప్పటి మాట. పబ్లిసిటీ కోసమే ప్రజా ప్రతినిథులన్నట్టు తయారైంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో వైసీపీ ప్రజా ప్రతినిథులు నిబంధనలకు నీళ్ళొదిలి మరీ జనంలోకి వెళ్ళి పబ్లిసిటీ స్టంట్లు చేశారు.
ఫలితం, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో రెండో స్థానంలో నిలిచింది. అయినా, అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు మారడంలేదు. ఆయా ప్రారంభోత్సవాల సమయంలో పాల్గొనడం తప్పనిసరైతే, ‘అతి తక్కువ మందితో’ ఆయా కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ, అలా చేస్తే ‘కిక్కు’ లభించదు కదా.! అందుకే, జనాన్ని పోగేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మాస్క్లు కూడా ధరించడంలేదు. వైసీపీ ఎమ్మెల్యే రోజా గతంలో అంబులెన్స్ల ప్రారంభోత్సవంలో మాస్క్ ధరించకపోవడం విమర్శలకు తావిచ్చిన విషయం విదితమే. అంతకు ముందు ఓ ‘బోరు’ ప్రారంభోత్సవానికి వెళ్ళి పూలు చల్లించుకోవడం వివాదాస్పదమయ్యింది. తాజాగా బైక్ అంబులెన్స్లు ప్రారంభించిన క్రమంలో మాస్క్ ధరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయా కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిథులు పాల్గొనడాన్ని తప్పు పట్టలేం. కానీ, ‘మంచి చెప్పాల్సిన, మంచి చేయాల్సిన’ ప్రజా ప్రతినిథులు బాధ్యతను విస్మరిస్తే ఎలాగన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. అధికార పార్టీకి చెందిన మీడియాలో ఈ ఫొటోల్ని ప్రముఖంగా ప్రచురించడం ఆ పార్టీ మద్దతుగారులకు అద్భుతంగా వుండొచ్చేమోగానీ, వాటిని సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం తీవ్రంగా తప్పు పడుతున్నారు. ‘ఈ పరిస్థితుల్లో ఈ తరహా పబ్లిసిటీ స్టంట్లు అవసరమా..’ అంటూ ప్రశ్నిస్తోన్న నెటిజన్లకు ప్రజా ప్రతినిథుల ఏం సమాధానం చెబుతారో ఏమో.!
572187 97680dude this just inspired a post of my own, thanks 466761
582114 870439Thanks for blogging and i enjoy the weblog posting so no public comments.,,,,,,,,,,, 988086
388889 649006Hey! I just wish to give an enormous thumbs up for the excellent information youve got here on this post. I will likely be coming back to your weblog for a lot more soon. 91031