తెలంగాణలో టీఆర్ఎస్ హవా ముందు నిలబడలేకపోతున్న కాంగ్రెస్.. రెండో స్థానం కోసమే బీజేపీతో పోటీపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని లింగోజీగూడ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. కమలం పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. డిసెంబర్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడ నుంచి బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ గెలుపొందారు. అయితే, ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే అకాల మరణం చెందారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బీజేపీకి చెందిన కొందరు నేతలు ఏకగ్రీవం కూడా ప్రయత్నించారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుమతి లేకుండానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ ను కలిసి అధికార పార్టీ తరపున పోటీ పెట్టొద్దని కోరారు. దీనికి కేటీఆర్ సానుకూలంగా స్పందించి ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, కాంగ్రెస్ మాత్రం బరిలో నిలవడంతో పోటీ అనివార్యమైంది. బీజేపీ నుంచి మందుగుల అఖిల్ పవన్ గౌడ్, కాంగ్రెస్ నుంచి దర్పల్లి రాజశేఖర్ రెడ్డితోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా.. అనూహ్యంగా ఈ సీటును కాంగ్రెస్ దక్కించుకుంది. సిట్టింగ్ స్తానం చేజారడంతో బీజేపీ నిరాశలో మునిగిపోగా.. జీహెచ్ఎంసీలో తమ సభ్యుల సంఖ్య మూడుకి చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.
76687 709898I dugg some of you post as I thought they were incredibly beneficial handy 124518
903639 168330Cheers for this excellent. I was wondering whether you were planning of publishing comparable posts to this. .Keep up the outstanding articles! 96760