‘మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయి.. అందరూ దానికి సన్నద్ధం కావాలి.. నిత్యం ప్రజల్లో ఉండాల’ని సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ప్రతిఒక్కరూ గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు ప్రజలకు వివరించాలి. 98శాతం హామీలు నెరవేర్చిన మనకు 175 సీట్లు ఎందుకు రావు..? రాష్ట్రంలో పాలన పారదర్శకంగా, వివక్ష, అవినీతి లేకుండా జరుగుతోంది. సచివాలయాలనే గొప్ప వ్యవస్ధను తీసుకునిరాగలిగాం. ఉత్తర నియోజకవర్గంలో 76శాతం ఇళ్లలో సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తోంది’.
‘దాదాపు 1.05 లక్షల ఇళ్లుంటే దాదాపు 80 వేల ఇళ్లకు పథకాలు అందాయి. ప్రజా సమస్యలు తీర్చే విధంగా బటన్ నొక్కే కార్యక్రమం నేను చేయాలి.. మీరు చేయాల్సినవి మీరు చేయాలి. ప్రతి ఇంట్లో అక్క, చెల్లెమ్మ పేరుతో జరిగిన మంచిని వారికి వివరిస్తూ.. గుర్తు చేస్తూ.. ప్రజల ఆశీస్సులు తీసుకోవాలి’ అని సీఎం అన్నారు.
710322 50875Its like you read my mind! You appear to know a whole lot about this, like you wrote the book in it or something. I think which you could do with several pics to drive the message home a bit, but other than that, this is fantastic blog. A fantastic read. Ill undoubtedly be back. 788860