Guntur Kaaram: మహేశ్ (Mahesh) హీరోగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాకు మనోజ్ పరమహంస (Majoj Paramahamsa) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అయితే.. అప్పటికే పూర్తైన 50శాతం పి.ఎస్.వినోద్ (PS Vinod) పని చేశారు. అనుకోని కారణాలతో ఆయన తప్పుకోగా మనోజ్ కెమెరా బాధ్యతలు చేపట్టారు. అయితే.. తానెలా ప్రాజెక్టులో భాగమయ్యారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు..
‘ఎందరితోనే సినిమా చేస్తున్న నువ్వు మహేశ్ తో ఎందుకు చేయట్లేదనే ప్రశ్నలు వచ్చేవి. ఇప్పుడు గుంటూరు కారంతో సమాధనం చెప్పినట్టే. వినోద్ ఎందుకు తప్పుకున్నారో నాకు తెలీదు. నా క్లోజ్ ఫ్రెండ్ థమన్ ఫోన్ చేసి గుంటూరు కారంకు పని చేయాలని అడిగారు. అయితే.. లియో తర్వాత నిఖిల్ స్వయంభూ చేయాల్సి ఉందని చెప్పా’.
‘డేట్స్ క్లాష్ అవుతాయేమోనని అంటే.. అవి మేము చూసుకుంటామన్నారు. ఇతర కమిట్ మెంట్స్ రీ-షెడ్యూల్ చేసుకుని ప్రాజెక్టులో భాగమయ్యా. అయితే.. కెమెరా గురించి మహేశ్ కు పూర్తి పరిజ్ఞానం ఉంది. ఆయనతో పని చేయడం సవాలే (నవ్వుతూ)’నని అన్నారు. గుంటూరు కారం జనవరి 12న విడుదల కాబోతోంది.