‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. తన తండ్రి చిరంజీవి 10 ఏళ్ళ కలని నిజం చేయాలని సుమారు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ భారీ పీరియాడికల్ ఫిల్మ్ సెప్టెంబర్ 2న 5 భాషల్లో రిలీజ్ కానుంది. చిరు డ్రీం ప్రాజెక్ట్, అలాగే హోమ్ బ్యానర్ కాబట్టి రామ్ చరణ్ చిరంజీవికి ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చి ఉండరు కూడా అని అనుకున్నారు. కానీ అలా అనుకుంటే మనం భ్రమ పడినట్టే అని లేటెస్ట్ న్యూస్ చెబుతోంది.
సొంత బ్యానర్, కొడుకే నిర్మాత అయినప్పటిలోకీ మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాకి గాను సుమారు 40 కోట్ల పారితోషికం తీసుకున్నారు అని ఈ చిత్ర సన్నిహితులు చెబుతున్నారు. ఇది విన్న మీరు కూడా అంత తీసుకున్నారా ?అని షాక్ అయినట్టున్నారు. ఎక్కువమంది ఇలాంటి షాక్ లోనే ఉంటే, కొందరు ట్రేడ్ వర్గాల వారు మాత్రం సినిమా బడ్జెట్ లో చూపించడానికి, ఎక్కువ ప్రైజ్ కి అమ్ముకోవడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ చిరు 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది చిత్ర సీమలో నేటి హాట్ టాపిక్.
చిరంజీవి సరసన నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుధీప్, జగపతి బాబు, రవికిషన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సైరా కి అమిత్ త్రివేది మ్యూజిక్ అందించారు.
887017 812128Attractive portion of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I get in fact loved account your weblog posts. Anyway I will likely be subscribing to your augment and even I success you get admission to constantly rapidly. 133695
982743 483452I like this weblog its a master peace ! Glad I observed this on google . 88885