తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, గడచిన ఐదేళ్లలో జరిగిన ఓ పెద్ద ‘తప్పు’ గురించి కాస్త తీరిగ్గా తెలుసుకుని కుమిలిపోతున్నారట. ఆ తప్పు ఏంటో తెలుసా.? ‘అహంకారం’. ‘ఐదేళ్ళు అధికారం మాదే.. ప్రతిపక్షాన్ని కూడా నిర్వీర్యం చేసేశాం.. ఇకపై ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు.. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే..’ అనే అహంకారమే తెలుగుదేశం పార్టీని ఇంతలా దెబ్బతీసింది.
మీడియాలో టీడీపీ అనుకూల రాతలకు చంద్రబాబు అప్పట్లో మురిసిపోయారు. ఆ రాతల్లో ‘అనుకూలత’ ఎంతో ఇప్పుడిప్పుడే చంద్రబాబుకి అర్థమవుతోంది. రాజధాని, పోలవరం సహా.. అనేక విషయాల్లో చంద్రబాబు అహంకార పూరిత వైఖరినే ప్రదర్శించారు. నిజానికి, అన్ని విషయాల్లోనూ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ప్రతిపక్షంగా వైసీపీ అప్పట్లో గళం విప్పినప్పుడే చంద్రబాబు వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేసి వుండాలి.
కానీ, ఇంటెలిజెన్స్ విభాగంలోనూ తన భజన చేసేవాళ్ళనే నియమించుకున్నారాయన అప్పట్లో. దాంతో, ‘వాస్తవం’ అనేది దాదాపుగా చంద్రబాబు కంటికి కన్పించలేదు. అగ్రిగోల్డ్ విషయంలో అయినా, పేదలకు ఇళ్ళ నిర్మాణం విషయమైనా.. అన్నిట్లోనూ చంద్రబాబుకి చాలా వెసులుబాట్లు వున్నాయి అప్పట్లో. కానీ, ఆ దిశగా చంద్రబాబు అడుగులేయలేదు. కారణం, అహంకారం.. మళ్ళీ అధికారంలోకి తామే వస్తామన్న గుడ్డి నమ్మకం. ఇప్పుడేమయ్యింది.? వైసీపీ ఒక్కో పనీ చక్కబెట్టుకుంటూ వెళ్ళిపోతోంది.
పబ్లిసిటీ పరంగా కలిసొచ్చే ఏ ఒక్క విషయాన్నీ వైఎస్ జగన్ వదిలిపెట్టడంలేదు. చంద్రబాబు హయాంలో చక్కబడిన పనులకి, వైసీపీ రంగులేసేసి పూర్తి చేసేస్తున్నారు. మరోపక్క, గ్రామ వాలంటీర్ల ద్వారా ‘అన్నీ జగనన్నే చేస్తున్నాడు..’ అంటూ పబ్లిసిటీ చేయించేసుకుంటోంది వైసీపీ. ఇక్కడే చంద్రబాబు తెగ ఇదయిపోతున్నారు. ‘పబ్లిసిటీలో నన్నే మించిపోతున్నాడు..’ అంటూ జగన్ మీద గుస్సా అవుతున్నారు. అధికారంలో వున్నప్పుడే, కళ్ళకు కట్టుకున్న గంతల్ని తీసేసి, చంద్రబాబు వాస్తవాల్ని గ్రహించి వుంటే.. టీడీపీకి ఇప్పుడీ దుస్థితి పట్టేది కాదేమో.!
236101 375491Extremely interesting topic , thanks for posting . 801356
487510 340132Constructive criticism is usually looked upon as becoming politically incorrect. 872268