కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఆ సమస్యలు ఈ సమస్యలు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొందరు విదేశీయులు మృతి చెందారు అన్నట్లుగా కూడా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ గురించి వస్తున్న పుకార్లపై కేంద్రం సీరియస్ గా స్పందించింది. మీడియాలో లేదా సోషల్ మీడియాలో కరోనా వ్యాక్సిన్ గురించి పుకార్లు ప్రచారం చేసినట్లుగా గుర్తిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భారత్ లో తయారు అయిన కోవాగ్జిన్ మరియు కొవిషీల్డ్ పూర్తిగా సురక్షితం అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్థారించింది. కనుక దాని గురించి వచ్చే పుకార్లు నమ్మవద్దంటూ కేంద్ర ప్రభుత్వం జనాలకు విజ్ఞప్తి చేస్తుంది. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మడం ద్వారా కొందరు వ్యాక్సిన్ వేసుకునేందుకు భయపడుతున్నారు. తద్వారా వారి ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొందరు ఆందోళన పడుతున్నారు. తద్వారా వారికి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. కనుక ఇకపై కరోనా వ్యాక్సిన్ పుకార్లు నమ్మవద్దని, అలాగే జనాలు పుకార్లను క్రియేట్ చేసి ప్రచారం చేయవద్దని కేంద్రం సూచించింది.
498397 855705Wohh exactly what I was looking for, appreciate it for posting . 362532
551902 11191Simply a smiling visitor here to share the love (:, btw excellent pattern . 77212
56522 961205Thanks for this excellent. I was wondering whether you were planning of writing comparable posts to this one. .Keep up the excellent articles! 744348
873754 875533You would endure heaps of different advised organized excursions with various chauffeur driven car experts. Some sort of cope previous features and a normally requires a to obtain travel within expense centre, and even checking out the upstate New York. ??????? 835255